
తిరుమల తిరుపతి దేశస్థానం వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. తితిదే అర్చకులు, భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ ఛైర్మన్ గా జ్యుడిషియల్ ప్రివ్యూ ఛైర్మన్ జస్టిస్ శివశంకర్ రావును నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అర్చకుల శాశ్వత నియామకం ఉందని ప్రభుత్వ పేర్కొంది.