
దిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరికాసేపట్లో తమ ఐదో మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన దిల్లీ కెప్టెన్ రిషన్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్ ల్లో దిల్లీ. మూడు విజయాలు, ఒక ఓటమితో కొనసాగుతుండగా హైదరాబాద్ ఒక గెలుపు మూడు ఓటములతో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.