వివాహితను లైంగికంగా వేధించిన కేసులో జర్నలిస్టుపై కేసు నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లో నివాసం ఉంటూ ఓ పత్రికలో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నివాసానికి సమీపంలో ఉన్న ఓ గృహిణితో పరిచయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా సదరు గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో రిపోర్టపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్