భూ సరిహద్దు వివాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన ఘంటసాల మండలంలోని చిలకలపూడిలో గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వీరప్రాసాద్ దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై వీరప్రసాద్ కుమారుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ వర్గీయులు హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.