
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్రా ఇంచార్జి తరుణ్ ఛుగ్, ముఖ్యనేతలు డీకే అరుణ, అరుణ్ సింగ్ లక్ష్మణ్, మురళీధర్ రావు, సత్యకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.