
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట చేరుకున్నారు. అమిత్ షా కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మీనందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.