నిర్మల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ సభ వేదికపైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపురావు, ఈటల హాజరయ్యారు. సర్దార్ వల్లభయ్, రాంజీ గోండు, కొమురం భీం విగ్రమాలకు షా నివాళులు అర్పించారు. యావత్ తెలంగాణ హుజూరాబాద్ లో ఏం జరగబోతోందని ఎదురుచూస్తోందని, అక్కడ బీజేపీనే గెలుస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.