కాబూల్ ను తాబిబాన్ తమ ఆధీనంలోకి తీసుకున్న మూడో రోజునే ఓ ఐదుగురు మహిళలు ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు. వీరి ధైర్యసాహసాలు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. గత 20 ఏళ్ల క్రితం దక్కిన హక్కులు తమకు కావాలంటూ ఐదుగురు మహిళలు ఆందోళనకు పూనుకున్నారు. చేతుల్లో ప్ల కార్డులు పట్టుకుని ప్రధాన వీధిలో నిల్చుని నినాదాలు చేశారు. అలాగే రాజకీయాల్లో కూడా పాల్గొనే హక్కును అమలు చేయాలంటూ వారు నినదించారు.