దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితులపు శాంత పరిచేందుకు టీకా ఉత్పత్తులను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అత్యవసర వినియోగానికి అనుమతించిన టీకాలు పెద్ద మొత్తం లో ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం ద్వారానే కొవిడ్ ను అదుపులో పెట్టవచ్చునన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆజాద్ లేఖ రాసి పలు సూచనలు చేశారు.