
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4,97,361 చేరాయి. యాక్టివ్ కేసులు 65,757 కు పెరిగాయి. ఈరోజు వరకు 2739 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 55,358 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.