మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో ప్రజతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణెలో కొత్తగా 353 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవగా, బ్లాక్ ఫంగస్ వల్ల 20 మంది మరణించారు. ప్రస్తుతం పుణె జిల్లాలో 115 మంది బ్లాక్ ఫంగస్ రోగులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.