
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే తెరాసలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి రమణ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.