spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP MLC arrested : తిరుమలలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు

YCP MLC arrested : తిరుమలలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు

YCP MLC arrested : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని పకడ్బందీగా ఉన్నా, అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శ్రీవారి దర్శన టిక్కెట్లకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బాగా డిమాండ్ పెరిగింది. సాధారణ దర్శన టోకెన్లు దొరకడం కూడా కష్టతరంగా మారిన నేపథ్యంలో, బ్లాక్ టిక్కెట్ల విక్రయాలు బాగా పెరిగాయి. సాధారణ భక్తులకు అందుబాటులో ఉండని దర్శన టిక్కెట్లు, అక్రమార్కుల దగ్గర ఇబ్బడిముబ్బడిగా దొరుకుతుండటం విస్మయానికి గురిచేస్తుంది. తాజాగా ఇదే వ్యవహారంలో ఓ వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు కావడం సంచలనంగా మారింది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో అక్రమాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయనే ప్రచారం ఎక్కువగా ఉంది. సాధారణ టిక్కెట్ల కంటే బ్రేక్ దర్శన టిక్కెట్లకు ఉన్న డిమాండే వేరు. వాటి కోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సిఫార్సు లేఖలను పొందుతుంటారు. ఆ లేఖలు ఉంటే రూం కూడా దొరకడం ఈజీ. అంతేగాక, దర్శనం కూడా బాగా జరుగుతుంది. వీఐపీ భక్తుల కోసం ఓ ప్రత్యేక సమయాన్ని టీటీడీ కేటాయించి ఉంటుంది. ఇదే అదునుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు వ్యాపారంగా మార్చుకొని సిఫార్సు లేఖలను అందజేస్తుండటం విచారించదగ్గ విషయం.

టీటీడీ టిక్కెట్ల కుంభకోణానికి వైసీపీ ఎమ్మెల్సీ షేక్ షార్జాశ్రీ ఉన్నట్లు తిరుమల దేవస్థానం అధికారులు తేల్చారు. ఆయన తిరుమల దర్శనానికి తరుచూ వస్తున్నారు. వెంట 10 నుంచి 20 మందిని తీసుకువచ్చుకుంటున్నారు. వారందరికీ ప్రోటోకాల్ దర్శనం చేయించుకుంటున్నారు. ఈ సారి ఎందుకో తిరుమల అధికారులకు డౌటు వచ్చింది. ఎమ్మెల్సీ వెంట వచ్చిన వారందరీ ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేశారు. వారందరివి తప్పుడు ఆధార్ కార్డులని తేలింది. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు తీసుకొని దర్శనానికి తీసుకువస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. సదరు ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో లక్ష రూపాయలకు మించి జమయినట్లు తెలిసింది. దాంతో వెంటనే ఆ పది మందితో పాటు ఎమ్మెల్సీ షేక్ షార్జాశ్రీని కూడా టీటీడీ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

తిరుమలకు ఇలా మందిని వెంటేసుకురావడం అధికార పార్టీ నాయకులకు షరా మామూలుగా మారింది. ఆ మధ్య మంత్రి రోజా ఓ 30 నుంచి 40 మందితో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద దూమారమే రేపింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల గౌరవ మర్యాదలపైనా వివాదాలు నెలకొన్నాయి. మద్యం, గంజాయి కూడా దొరుకుతుండటంపై భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పద్దతులు మార్చుకుంటారా? లేక అధికార పార్టీ కదా అని చూసీచూడనట్లు వ్యవహిరస్తారా అనేది వేచి చూడాల్సిందే.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YSR Congress Party

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
YS Jagan

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...
Tanuja

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Tollywood Heroes

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...
Oktelugu Epaper