ఆంధ్రప్రదేశ్‌వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

వైసీపీ సవాల్ కు బాబు స్పందిస్తారా?

Chandrababu Naidu
అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, మీరు గెలిస్తే రాజధాని తరలింపునకు తాము అడ్డుకోబోమని చెప్పారు. ఈ సవాలుపై స్పందించేందుకు వైసీపీ ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చారు. చంద్రబాబు సవాల్ ను అధికార పక్షం స్వీకరించలేదు. మీడియా ద్వారా చంద్రబాబుకు తమ సమాధానం చెప్పారు. దీంతో పిరికి పందలు పారిపోయారని వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. విశాఖను ఎంతో అభివృద్ధి చేశానని, విశాఖ ప్రజలు అంటే తనకెంతో ఇష్టమని చంద్రబాబు ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా మార్చాలని అనుకున్నానని బాబు చెప్పారు. ఈ వ్యాఖ్యలను మంత్రి అవంతి శ్రీనివాసరావు తప్పుబట్టారు. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న చంద్రబాబు విశాఖకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆర్ధిక రాజధానిగా మార్చేందుకు విశాఖకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలని అవంతి కోరారు.

అంతటితో ఆగకుండా విశాఖకు రాజధాని అవసరమో… కాదో తేల్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అవంతి సవాల్ విసిరారు. ఈ సవాల్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. తన సవాల్ కు స్పందించలేదని వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఈ సవాల్ ను స్సందించకపోతే అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

Also Read: హై కోర్టు స్టే పై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం..!

విశాఖ ప్రజలు ఎంతో మంచి వారని, అమరావతి రైతుల పొట్టగొట్టి తమకు రాజధాని ఇమ్మని విశాఖ జనం ఎప్పటికీ అదగరని వారి తరుపున వకాల్తా పుచ్చుకుని చంద్రబాబే చెప్పడం ఉత్తరాంధ్ర వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని ఏర్పాటు చేస్తామంటే వద్దని ఎవరంటారు? విశాఖనే రాజధానిగా ప్రకటించాలని విభజన సమయంలో ఉద్యమాలు చేశారు. ఆ మాట కొస్తే అన్ని జిల్లాలు ఆ సమయంలో రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Jagan Mohan Reddy : ఏదో పాపం చిన్న పిల్లాడు.. యాక్సిడెంట్ చేశాడు.. దానికే కేసు వేస్తారా? – జగన్

Jagan Mohan Reddy : ఈమధ్య కాలంలో ఏమైందో ఏమో తెలియడం లేదు కానీ , మాజీ సీఎం జగన్ పెద్ద ట్రోల్ స్టఫ్ గా మారిపోతున్నారు. బయటకి వస్తే చాలు మీమర్స్...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Oktelugu Epaper