Homeఅంతర్జాతీయంసంచాలన కథనం: వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందా?

సంచాలన కథనం: వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందా?

COVID 19కరోనా వైరస్ పుట్టుక గురించి గందరగోళం రేగుతోంది. ఇప్పటికే పలుమార్లు కరోనా పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధనలు సాగినా సరైన ఆధారాలు చూపించలేకపోతున్నారు. ఫలితంగా దాని ఆవిర్భావం గొడవలే జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని వుహాన్ ల్యాబ్ విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. దీంతో వైరస్ ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి బలం చేకూరుతోంది. అమెరికా ఇంటిలిజెన్స్ సంస్థల నివేదికల ఆధారంగా వాల్ స్ర్టీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే అణుశాస్ర్తవేత్తల జర్నల్ బులెటిన్. ఓఆర్జీలో కూడా ల్యాబ్ లీకేజీపై కథనం వచ్చి సంచలనం సృష్టించింది. వీటిల్లో వేటికి చైనా ఆధారాలు చూపించి ఖండించలేదు. తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ పాక్ట్ షీట్ లోని విషయాలు బయటకు రావడంతో మరోసారి చైనా పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి.

బాహ్య ప్రపంచంలో సార్స్ కోవ్ 2 వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్ లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో కోవిడ్ 19 కనిపించి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. అమెరికా ఇంటిలిజెన్స్ వద్దకు ఈ సమాచారం ఒక నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామి నుంచి వచ్చింది. అత్యంత చాతుర్యంతో చాలా ఖచ్చితమైన సమాచారం వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. వారు ఎందుకు జబ్బు పడ్డారో కారణం మాత్రం తెలియడం లేదని తెలిపారు.

చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ 8న తొలి సార్స్ కోవ్ 2 కేసు నమోదైంది. చాలా మంది వైరాజిస్టులు అంటువ్యాధుల చికిత్స నిపుణులు మాత్రం 2019 డిసెంబర్ లోనే వుహాన్ లో వ్యాపించిందని చెబుతున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ మాతరం రా డేటా, సేఫ్టీ లాగ్స్, గబ్బిలాల్లోని కరోనా వైరస్ లపై పరిశోధనలు చేసిన ల్యాబ్ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు.

హడ్సన్ ఇన్ స్టిట్యూట్ లో గతేడాది మార్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ లెవల్ 3 ల్యాబ్ లో చాలా రక్షణ ఉంటుది. అక్కడ కరోనా వైరస్ లపై పని చేస్తున్న ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో ఇన్ ఫ్లు యెంజా లక్షణాలు ఉన్నాయి. వీరంతా ఒకే వారంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం కానీ, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడం గానీ జరిగింది. పరిశోధకులు జబ్బు పడడమే మొదటి క్లస్టర్ కావచ్చు అని పేర్కొన్నారు. పాంపియో గతంలో నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ల్యాబ్ నుంచి వైరస్ లీకయ్యే ప్రమాదం లేదని పేర్కొంది. అమెరికా కావాలనే రె చ్చగొట్టే విధంగా చేస్తోందని చెప్పింది. వైరస్ తమ దేశంలో పుట్టలేదని బయట నుంచి వచ్చిందని పేర్కొంది. అమె రికాలోని మేరీ ల్యాండ్ లో ఉన్న పోర్ట్ డెట్రిక్ సైనిక స్థావరం లోని ల్యాబ్ నుంచి వచ్చిందని ఆరో పించింది. ఈ ఏఢాది జనవరిలో వుహాన్ ల్యాబ్ కు వచ్చిన నిపుణుల బృందంతో బ్యాట్ ఉమెన్ గా పేరున్న షీఝెంగ్ లీ మాట్లాడుతూ తమ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ కాలేదని తెలిపారు. తమ సభ్యుల్లో ఇప్పటికీ కరోనా వైరస్ యాంటీ బాడీలు లేవు అని పేర్కొన్నారు. అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్యాక్ట్ షీట్ మాత్రం షీ చెప్పిన మాటలు ఎంత వరకు నమ్మశక్యం అనే అంశంపై సందేహాలు వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కోవిడ్ కేసుల్లో 92 మంది అక్టోబర్-డిసెంబర్ మొదటి వారం మధ్యలో అస్వస్థతకు గురైనట్లు గుర్తించింది. వారి డేటా ఇవ్వాలని కో రగా చైనా తిరస్కరించింది. వుహాన్ లో బ్లడ్ బ్యాంక్ నమూనాలు ఇవ్వాలని వాటిల్లో2019 డిసె ంబర్ కంటే ముందు నమూనాలు పరిశీలిస్తామని పేర్కొంది. కానీ వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందని తొలుత పేర్కొని తరువాత అంగీకరించినా వాటిని పరిశీలించే అవకాశం ఇప్పటివరకు నిపుణులకు కల్పించలేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular