Minister Roja: మంత్రి రోజా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. కొద్దిరోజుల కిందట మంత్రి రోజాపై టిడిపి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బండారు సత్యనారాయణ పై కేసు నమోదు కావడం, విడుదల కావడం జరిగిపోయింది. అయితే తాజాగా మంత్రి రోజా చుట్టూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమె చెంపను చెల్లుమనిపించినట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రి రోజా సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టారు.ఆది నుంచి దూకుడు స్వభావం. రాజకీయంగా అదే గుర్తింపు తెచ్చి పెట్టింది. అదే స్థాయిలో వివాదాలు సైతం చుట్టుముట్టాయి. తాజాగా చంద్రబాబు అరెస్టు తర్వాత ఆమె వ్యవహార శైలి వివాదాస్పదమైంది. చంద్రబాబు కుటుంబ సభ్యులపై రోజా కామెంట్స్ నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి స్పందించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారం నెలకొంది. రోజాకు సొంత పార్టీ నుంచి కానీ.. తెలుగు సినిమా రంగం నుంచి కానీ.. అంతగా మద్దతు దక్కలేదు. అనూహ్యంగా కోలీవుడ్ నుంచి మద్దతు పొందగలిగారు. సీనియర్ హీరోయిన్లు కుష్బూ, రమ్యకృష్ణ, రాధిక శరత్ కుమార్, మీనా తదితరులు స్పందించారు. సంఘీభావం తెలిపారు. వారి స్పందన పై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కావాలని వారితో ఆ ప్రకటన చేయించినట్లు వార్తలు వస్తున్నాయి.
అప్పటినుంచి ఆ వివాదం నడుస్తుండగా.. రోజా దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో నటుడు ఆలీతో కలిసి రోజా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. భారీగా జనాలు హాజరైన ఈ కార్యక్రమంలో రోజా చెంపను గుర్తు తెలియని వ్యక్తి చెల్లుమనిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన జరిగిన వెంటనే అసలు మీరు ఏం చేస్తున్నట్టు అని భద్రతా సిబ్బందిపై రోజా ఫైర్ అయినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్కడా?ఎవరు దాడి చేశారనే దానిపై క్లారిటీ లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More