spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vijaysai Reddy: అయిష్టంగానే వైసీపీలో పదవి తీసుకున్న విజయ్ సాయి రెడ్డి

Vijaysai Reddy: అయిష్టంగానే వైసీపీలో పదవి తీసుకున్న విజయ్ సాయి రెడ్డి

Vijaysai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డి యాక్టివ్ అయ్యారు. రాయలసీమ బాధ్యతలను ఆయనకు కట్టబెట్టారు.గత కొన్ని నెలలుగా వైసీపీలో అంటి ముట్టినట్టుగా వ్యవహరించిన ఆయన అవసరాన్ని జగన్ గుర్తించినట్టు ఉంది. అందుకే కీలక బాధ్యతలు అప్పగించారు. బాలినేని వద్దనుకున్న బాధ్యతలను కట్టబెట్టారు.వైసీపీలో ఇదే చర్చనియాంశంగా మారింది.

వైసీపీలో విజయసారెడ్డిది యాక్టివ్ రోల్. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తూ జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీలో విజయసాయి రెడ్డికి గౌరవ స్థానం దక్కింది.నెంబర్ 2 స్థాయికి ఎదిగారు. కానీ గత కొంతకాలంగా ఆయన పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెంచి విజయ్ సాయి రెడ్డికి తగ్గించేశారన్న వార్తలు వచ్చాయి . విజయ్ సాయి రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కూడా రావడం మానేశారు. వీలైనంతవరకు ఢిల్లీలోనే గడుపుతూ వచ్చారు. మొన్న మధ్యన పార్టీ వర్క్ షాప్ లో విజయ్ సాయి పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. విజయ్ సాయి వయసు అయిపోయిన దృష్ట్యా ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకోనున్నట్లు జగన్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో విజయసాయిరెడ్డి కి వైసీపీలో చాప్టర్ క్లోజ్ అన్న ప్రచారం ఊపందుకుంది.

అయితే అనూహ్యంగా విజయ్ సాయి రెడ్డికి వైసీపీలో కీలక పదవిని కట్టబెట్టారు. చిత్తూరు,నెల్లూరు, కడప రీజనల్ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వర్తించేవారు. కానీ ఆయన అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. హై కమాండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలినేని వెనక్కి తగ్గలేదు. మిగతా నాయకులు సైతం బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో జగన్ విజయసాయిరెడ్డిని పిలిపించారు. ఆ మూడు జిల్లాల సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో విజయసాయి బాలినేనిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో తానే ఆ బాధ్యతలు తీసుకోవడం అనివార్యంగా మారింది.

ప్రస్తుతం విజయసాయిరెడ్డి వద్ద ఒక్క రాజ్యసభ పదవి ఉంది. తొలుత ఉత్తరాంధ్ర రీజనల్ సమన్వయకర్తగా ఉన్న విజయ్ సాయి వద్ద పార్టీ సోషల్ మీడియాతో పాటు అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలు ఉండేవి. కానీ ఒక్కొక్క పదవిని దూరం చేస్తూ వచ్చారు. ఆయన సైతం వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు. ఈ తరుణంలో విజయ్ సాయి రెడ్డిని పిలిచి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper