Homeజాతీయ వార్తలుStock Market Holiday Today : ఈరోజు గురునానక్ జయంతి.. స్టాక్ మార్కెట్ పనిచేయదా.....

Stock Market Holiday Today : ఈరోజు గురునానక్ జయంతి.. స్టాక్ మార్కెట్ పనిచేయదా.. BSE-NSEలో ఏం జరుగుతుంది ?

Stock Market Holiday Today :  గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూతపడతాయి. డెరివేటివ్‌లు, ఈక్విటీ, ఎస్‌ఎల్‌బి, కరెన్సీ డెరివేటివ్‌లు, వడ్డీ రేటు డెరివేటివ్‌లలో ట్రేడింగ్ ఆ రోజు మూతపడుతుంది. కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ కూడా ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య మూసివేయబడుతుంది. సాయంత్రం 5:00 నుండి 11.55 గంటల వరకు తెరిచి ఉంటుంది. నవంబర్ 18 (సోమవారం) నుంచి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా, నవంబర్ 20 (బుధవారం) కూడా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ఉంటుంది. దీని తరువాత, క్రిస్మస్ సెలవుల కారణంగా డిసెంబర్ 25 (బుధవారం) దేశీయ మార్కెట్లు మూసివేయబడతాయి. ఎస్ ఈ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2024లో 16 రోజుల ట్రేడింగ్ సెలవులు ప్రకటించబడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 13సార్లు మూతపడ్డాయి. చివరిసారి లక్ష్మీపూజ కోసం నవంబర్ 1వ తేదీ శుక్రవారం మూసివేశారు. దీని తరువాత డిసెంబర్ 25 బుధవారం క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లు మూసివేయబడతాయి.

మార్కెట్ పనితీరు రీక్యాప్.. వారంలో 2.5 శాతం క్షీణత
ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంక్, ఆయిల్ & గ్యాస్ పేర్లలో అమ్మకాల మధ్య నిఫ్టీ 23,550 దిగువన ముగియడంతో నవంబర్ 14న భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగియడం గమనార్హం. ట్రేడింగ్ ముగిసే సమయానికి.. సెన్సెక్స్ 110.64 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 77,580.31 వద్ద.. నిఫ్టీ 26.35 పాయింట్లు లేదా 0.11 శాతం పడిపోయి 23,532.70 వద్ద ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, నిఫ్టీలు వారంలో 2.5 శాతం పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 91 పాయింట్లు (0.18శాతం) పెరిగి 50,179 వద్దకు చేరుకుంది.

సెన్సెక్స్ ప్యాక్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. కాగా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో 2,159 షేర్లు గ్రీన్‌లో, 1,798 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కాగా, 93 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా ఒత్తిడి, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ 50ల క్షీణత కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

టాప్ ఫాలింగ్, రైజింగ్ స్టాక్స్
ఎఫ్‌ఎంసిజి, పవర్, పిఎస్‌యు బ్యాంక్, ఆయిల్ & గ్యాస్ రంగాలు 0.3-1 శాతం క్షీణించగా, ఆటో, మీడియా, రియల్టీ 0.6-2 శాతం పెరిగాయి. నిఫ్టీలో హెచ్‌యూఎల్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్, నెస్లే, బ్రిటానియా షేర్లు నష్టపోగా, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం పెరిగాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular