spot_img
Homeజాతీయ వార్తలుIndian Railways: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళ్తుందో...

Indian Railways: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళ్తుందో తెలుసా?

Indian Railways: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటి. మన దేశం ఐదో స్థానంలో ఉంది. 28 రాష్ట్రాల్లో రైలు మార్గాలు ఉన్నాయి. అన్ని రైలుమార్గాలు లింక్‌ అయి ఉన్నాయి. భారత దేశంలో అత్యధిక మంది రవాణా సాధనం కూడా రైలే. అయితే చాలా రైల్లు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ప్రయాణిస్తాయి. కొన్ని రైళ్లు మాత్రం కొన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఉన్నా… కొన్ని రైళ్లు మాత్రమే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాయి. అయితే ఒక రైలు మాత్రం దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ప్రజల ఆదరణతో రైల్వే శాఖ కూడా దీనిని కొనసాగిస్తోంది. అయితే ఆ రైలు ఏది.. ఎంత దూరం ప్రయాణిస్తుంది. ఎన్ని రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.

13 రాష్ట్రల గుండా ప్రయాణం..
భారత రైల్వేలో 13 రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు ఒకటి ఉంది. దేశంలోని దాదాపు సంగం రాష్ట్రాలను ఇది కలుపుతుంది. ఆయా రాష్ట్రాల ప్రజలను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఆ రైలుపేరే నవయుగ్‌ ఎక్స్‌ప్రెస్‌. ఇది కర్ణాటక నుంచి జమ్మూకశ్మీర్‌కు ప్రయాణిస్తుంది. కర్ణాటకలోని మంగళూరు నుంచి జమ్మూ కశ్మీర్‌లోని జమ్ముతావి వరకు నడుస్తుంది. మార్గం మధ్యలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ మీదుగా జమ్ముతావి చేరుకుంటుంది.

12 రాష్ట్రాల్లో హాల్టింగ్‌..
ఇక ఈ నవయుగ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 12 రాష్ట్రాల్లో హాల్గింగ్‌లు ఉన్నాయి. ఒక్క హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రమే నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తుంది. ఈ రైలు మంగళూరు నుంచి జమ్ముతావి చేరుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. 13 రాష్ట్రాలను దాటడానికి 68 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. భారత దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper