vijayashanthivijayashanthi
తెలంగాణలో జరిగే దుబ్బాక ఎన్నికల బరిలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్,ప్రముఖ హీరోయిన్ విజయశాంతిని నిలపాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కానీ ఈ లేడి అమితాబ్ మాత్రం తేల్చడం లేదట.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాక చాలా రోజులకు రాజకీయాల్లోకి వచ్చారు విజయశాంతి. ఆ తర్వాత తెలంగాణ కోసం ఉద్యమించి గులాబీ గూటికి చేరారు. అక్కడ కేసీఆర్ తర్వాత నంబర్ 2 అనిపించుకున్నారు. కానీ కేసీఆర్ తో విభేదాలు ఆమెను పార్టీ మారేలా చేశాయి. 2014కు ముందు కాంగ్రెస్ లో చేరారు. కానీ బ్యాడ్ లక్.. అదే టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కట్ చేస్తూ మళ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయ్యారు.
Also Read: ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్టుపై కిషన్ రెడ్డి సీరియస్.. పోలీసులు, ఈవో సస్పెండ్?
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయశాంతి తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.తను పిల్లలను కనకపోవడానికి కారణాలను విజయశాంతి వివరించారు. ప్రజాసేవకు అంకితం కావాలనే ఉద్దేశంతోనే పిల్లలను కనలేదని విజయశాంతి పేర్కొన్నారు. సంతానం ఉంటే ఆశ పెరిగిపోతుందని.. స్వార్థం ఎక్కువైపోతుందనే కనలేదని వివరణ ఇచ్చారు. నేను నా భర్త, పిల్లలు వద్దని అనుకున్నామని.. ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నానని తెలిపారు. నా మరణానంతరం ఆస్తినంతా ప్రజలకు ధారపోస్తానని వివరించింది. నా తల్లి పేరు, నా పేరున ఫౌండేషన్ పెట్టి సేవచేస్తానని వివరించారు. విలాసాలపై ఆసక్తి లేదని.. నా నగలన్నింటిని ఓ సారి మెదక్ లోని వేంకటేశ్వర స్వామి హుండీలో వేశానని వివరించింది.
ఇక సినీ నటులు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాణించలేకపోవడానికి కారణాన్ని విజయశాంతి వెల్లడించారు. ఇప్పటి కుట్రలు, కుతంత్రాలు తట్టుకోలేక వారు రాణించలేకపోతున్నారన్నారు. సినీ నటులు చాలా సెన్సిటివ్ గా ఉంటారని అందుకే..రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారని వివరించారు.
Also Read: రాజ్యసభలో రణరంగం.. వ్యవసాయ బిల్లులకు ఆమోదం
సినిమా రంగంలో డబ్బు, హోదా అన్ని చూశానని.. ఆస్తులు కూడబెట్టుకోవడానికో.. పేరు ప్రఖ్యాతల కోసమో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఇక 2014 ఎన్నికల్లో ఓడిపోయాక ఎందుకు క్రియాశీల రాజకీయాల్లో లేరనే ప్రశ్నకు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్నికల తర్వాత పూర్తిగా ఆరోగ్యం క్షీణించిందని.. ఓ పెద్ద ఆపరేషన్ కూడా జరిగిందని వివరించారు. దాన్నుంచి కోలుకోవడానికే రెండేళ్ల సమయం పట్టిందని.. అందుకే ఆ సమయంలో సినీ, రాజకీయాలకు దూరంగా ఉన్నానని అసలు రహస్యాన్ని విజయశాంతి చెప్పుకొచ్చారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: That is why vijayashanti did not see children
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com