Homeఆంధ్రప్రదేశ్‌రామోజీ మెడకు మళ్లీ ‘మార్గదర్శి’ ఉచ్చు

రామోజీ మెడకు మళ్లీ ‘మార్గదర్శి’ ఉచ్చు


ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మెడకు మరోసారి ‘మార్గదర్శి’ ఉచ్చు పడింది. ఈ ఫైనాన్షియల్ సంస్థలో అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో హైకోర్టులో చాకచక్యంగా విచారణ కొట్టివేయబడింది. కానీ ఇప్పుడు మార్గదర్శి అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

Also Read: ‘ఈనాడు’తో లాభం లేదనుకుంటున్న రామోజీ?

నిజానికి ఈ కేసు నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి వేయించిన కేసు. ఆ కేసులో ఆ తర్వాత హైకోర్టులో రామోజీరావు కొట్టివేసేలా చేసుకున్నారు. ఈ కథ ఇక్కడితో ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉండవల్లి మరోసారి అనూహ్యంగా తిరగదోడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అక్కడ సీఎం జగన్, ఇక్కడ కేసీఆర్ లు ఈనాడు సంస్థపై, అధినేత రామోజీరావు రాతలపై ఆగ్రహంగా ఉన్న వేళ ఈ కేసులు మళ్లీ మొదటికి రావడం రాజకీయంగా వేడెక్కించింది.

వైఎస్ఆర్ హయాంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి మార్గదర్శి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసును అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును సవాల్ చేస్తూ సుప్రీంను తాజాా ఆశ్రయించారు.తాజాగా మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్ చేసేందుకు అనుమతినిచ్చింది.

గతంలో ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ( ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది. గోప్యంగా ఉంచిన ఉమ్మడి హైకోర్టు తీర్పును ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి.. తాజాగా కోర్టును ఆశ్రయుంచారు. 266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.

Also Read: అర్థగంటలోనే కరోనా రిజల్ట్!

ఈ రోజు రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజు కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే రామోజీపై కొద్దికాలంగా ఎక్కడ దొరుకుతాడని భావిస్తున్న ఏపీ సీఎం జగన్ ఇందులో కీలకపాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు అని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇక కేసీఆర్ కూడా నజర్ పెడితే ఈ కేసులో మరిన్ని చిక్కులు రామోజీకి తప్పవని అంటున్నారు. మొత్తంగా హైకోర్టులో సమసిపోయిన ‘మార్గదర్శి’ కేసు సుప్రీంలో మరోసారి విచారణకు రావడం రామోజీకి గుదిబండగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular