Homeజాతీయ వార్తలురాజకీయ పార్టీలకు, నేతలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

రాజకీయ పార్టీలకు, నేతలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme courtరాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించాలి. కానీ పార్టీలు అలా చేయలేదు. దీంతో సుప్రీంకోర్టు పార్టీలకు షాక్ తప్పేట్లు లేదు. దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. తీర్పును రిజర్వులో ఉంచింది. తీర్పులో ఏముందనే దానిపై పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన లాయర్ తో పాటు రాజకీయ పార్టీల తరఫున మరికొందరు సీనియర్ లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు.

మెజార్టీ లాయర్లు వినిపించిన వాదనల ప్రకారమైతే అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించని పార్టీల గుర్తింపును రద్దు చేయటమో లేకపోతే పార్టీ ల ఎన్నికల గుర్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలంటూ బలంగా వాదించారు. అంటే ఎవరే విధంగా వాదించినా నేరచరిత్రను వెల్లడించని పార్టీలపై చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నట్లు అర్థమైంది.

అందరి వాదనలను విన్న న్యాయమూర్తులు కూడా లాయర్ల వాదనతో ఏకీభవించారు. పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఉందన్న లాయర్ల వాదనతో జడ్జీలు సానుకూలంగా స్పందించారు. దాంతో తీర్పును రిజర్వులో ఉంచారు. ఈ సమస్యంతా ఎందుకొచ్చిందంటే బీహార్ ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రను పార్టీలు వెల్లడించలేదు. ఇదే విషయమై సీపీఎం, ఎన్సీపీ తరఫున లాయర్లు క్షమాపణ చెప్పినా కోర్టు అంగీకరించలేదు.

అంతా బాగానే ఉంది కానీ అందరిలో ఓ సందేహం మొదలైంది. అదేమిటంటే అభ్యర్థులు అఫిడవిట్లు దాఖలు చేసేటప్పుడే ఉన్న కేసుల వివరాలను చెబుతున్నారు. అలా చెప్పని అభ్యర్థుల నామినేషన్లను చెల్లకుండా చేయచ్చు. ప్రాథమిక దశలో అంటే నామినేషన్ దశలోనే అధికారులు కచ్చితంగా వ్యవహరిస్తే ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసులను వెల్లడిస్తారనటంలో సందేహం లేదు. దాన్ని వదిలేసి ఏకంగా పార్టీలపైన చర్యలుతీసుకోవాలనటంలో అర్థం లేదని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular