Margadarsi Case
Margadarsi Case: మార్గదర్శి కేసు విషయంలో జగన్ సర్కార్ కు ఝలక్ తగిలింది. మార్గదర్శి చిట్స్కు రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీస్ పై హైకోర్టు స్టే విధించింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్గదర్శి కేసులో జగన్ సర్కార్ దూకుడుకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
మార్గదర్శి చందాదారులకు నోటీసులు పేరిట చిట్స్ రిజిస్ట్రార్ భారీగా పత్రికలకు యాడ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక అనుకూల మీడియాతో పాటు నేషనల్ మీడియా సైతం భారీ ప్రకటనలు ఇచ్చారు. ఇందుకుగాను కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖ ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు దానిని కోర్టు తప్పు పట్టినట్లు అయింది. తీసుకోబోయే తదుపరి చర్యలను కోర్టు నిలిపివేసింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని.. చందా దారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావిస్తోంది. ఆ రెండు పిటిషన్లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయన్న విషయం గుర్తించుకోవాలని సూచించింది.
రామోజీరావును ఇబ్బందులు పెట్టాలని లక్ష్యంతో మార్గదర్శికి వ్యతిరేకంగా ఫుల్ పేపర్ యాడ్లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. 60 ఏళ్లకు పైగా లక్షల మంది ఖాతాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శిని గత కొంతకాలంగా జగన్ సర్కార్ వెంటాడుతోంది. కొద్దిరోజుల కిందట మార్గదర్శి చిట్స్ కి చెందిన కొన్ని గ్రూపులను ప్రభుత్వం నిలిపివేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిట్లను నిలిపివేయడంపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే వాదనలు విన్న హైకోర్టు చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది.దీనితో జగన్ సర్కార్కు ఝలక్ తగిలినట్లు అయింది.