
జబర్దస్త్ కామెడీ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. కమెడియన్లకు పంచ్లు వేసి నవ్వుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తున్న రోజా సెల్వమణి కన్నీరు పెట్టుకున్నారు. టీవీ షోలు, రాజకీయాలతో బిజీగా ఉంటున్న ఆమె ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. నియోజకవర్గ సమస్యలు, ప్రొటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు.
Also Read: బీజేపీలో చిన్నమ్మకు పెరిగిన గౌరవం
తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని.. అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. రోజా ఫిర్యాదుపై కమిటీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: అన్ని కష్టాలూ జగన్కే.. ఎందుకో ఈ పరిస్థితి..!
ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రోజా ఫిర్యాదు చేశారని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాలను జిల్లా కలెక్టర్కు చెప్పామని.. అవన్నీ సరిచేసి భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయిలో కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యల్ని కమిటీకి వివరించారని.. అవి తమ పరిధిలో లేకపోయినా సమావేశంలో చెప్పారని.. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు కాకాణి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్