spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Railway Budget 2024: రైల్వే బడ్జెట్ లో ఏపీకి అగ్రతాంబూలం.. అమరావతికి రూ.2 వేల కోట్లు!

Railway Budget 2024: రైల్వే బడ్జెట్ లో ఏపీకి అగ్రతాంబూలం.. అమరావతికి రూ.2 వేల కోట్లు!

Railway Budget 2024: ఏపీకి కేంద్రం అగ్ర తాంబూలం ఇస్తోంది. ఇప్పటికే ఏడు మాసాల బడ్జెట్లో అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. వెనుకబడిన జిల్లాలకు సైతం ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటన చేసింది. విభజిత రాష్ట్రానికి అన్ని విధాల చేయూత అందిస్తామని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ సాయం వివరాలను తెలుగులోనే వెల్లడించారు. తాజాగా రైల్వే బడ్జెట్లో సైతం ఏపీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా రూ.9151 కోట్ల రూపాయలు కేటాయించారు. కీలక ప్రాజెక్టులకు మోక్షం కల్పించారు.ఒక్క అమరావతి పరిధిలోనే రైల్వే లైన్ల అభివృద్ధికి రూ. 2,047 కోట్లు కేటాయించడం విశేషం. దీంతో అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం,అభివృద్ధి జరగనుంది. బడ్జెట్ కేటాయింపులతో పని లేకుండా ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. భూ సేకరణతో పాటు రహదారుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని స్పష్టం చేసింది. ఇప్పుడు రైల్వే లైన్ల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో అమరావతి రాజధానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అయితే ఒక్క అమరావతికే కాదు. ఏపీవ్యాప్తంగా రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణకు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం విశేషం. గత పదేళ్ల బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్ లో కూడా ఇంతలా కేటాయింపులు చేయలేదు.

* అమలు కాని విభజన హామీలు
2014లో రాష్ట్ర విభజన జరిగింది. 13 జిల్లాలతో ఏపీ మిగిలింది. కానీ కీలకమైన రైల్వే ప్రాజెక్టులు, ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. వాస్తవానికి విభజన హామీలలో చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తగినంత చొరవ చూపలేదు. గత రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ కారణంగానే ఏపీని పక్కన పెట్టినట్లు విమర్శలు ఉన్నాయి. కానీ ఈసారి ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకం. అందుకే బడ్జెట్ కేటాయింపుల నుంచి ప్రత్యేక నిధులు వరకు ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.

* తెరపైకి విశాఖ రైల్వే జోన్
ఈసారి రైల్వే బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ అంశం సైతం తెరపైకి వచ్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రస్తావించారు కూడా. రైల్వే జోన్ కావాలంటే విశాఖలో రైల్వేకు భూములు కేటాయించాలి. కానీ జగన్ సర్కార్ సమకూర్చలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి రిజర్వాయర్ పరిధిలో ఉండడంతో.. అది నిబంధనల ప్రకారం పనికిరాదు. కానీ వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూర్చితే తాము రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది కూడా ఒక రకమైన శుభ పరిణామమే.

* వైసిపి హయాంలో అంతంత మాత్రమే
గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు అంతంత మాత్రమే. కేవలం జగన్ సర్కార్ రుణ పరిమితులు పెంచుకునేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు ఉన్నాయి. కానీ తాజా కేటాయింపులు చూస్తుంటే ఏపీ విషయంలో కేంద్రం ఆలోచన మారినట్లు స్పష్టమైంది. ఇదే పరంపర మరో నాలుగేళ్లపాటు కొనసాగితే ఏపీ సమగ్ర అభివృద్ధి ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper