బీహార్ లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. లోక్ జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ పై ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. చిరాగ్ పాశ్వాన్ తో కలిపి మొత్తం ఆరుగురు ఎంపీలున్న ఎల్జీపీలో ఐదుగురు ఎంపీలు లోక్ సభాపక్ష నేతగా చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆ పార్టీ ఎంపీ పశుపతి కుమార్ షరాస్ ను ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎల్జీపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడే పశుపతి కుమార్ షరాస్. గతేడాది తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పటి నుంచి చిరాగ్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు.ఆయన తీరు పట్ల ఐదుగురు ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రికి ఉన్న సామర్థ్యం ఈయనకు లేదని వీరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
జేడీయూ పన్నిన పన్నాగమే ఇదని చిరాగ్ పాశ్వాన్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. తమ పార్టీలో అసమ్మతి వెనుక ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హస్తం ఉందని చిరాగ్ పాశ్వాన్ సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతేడాది తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తరువాత బిహార్ లో ఎన్డీఏనుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకొచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగాపోటీ చేసి నితీష్ ను పరోక్షంగా దెబ్బ కొట్టారు. దీంతో అప్పటి నుంచి సమయం కోసం వేచి చూస్తున్న నితీష్ కుమార్ ఎల్జీపీలో చీలిక తెచ్చి చిరాగ్ పై ప్రతీకారం తీర్చుకున్నట్లు చెబుతున్నారు.
లోక్ సభ లో తమను నేరుగా గుర్తించాలని కోరుతూ ఐదుగురు ఎల్జేపీ రెబెల్ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విన్నవించారు. పశుపతి కుమార్ పరాస్ ను తమ పార్టీ నేతగా చేయాని స్పీకర్ ను కోరారు. తమ రాష్ర్ట రాజకీయ పరిణామాలను కూడా వివరిస్తూ స్పీకర్ కు వీరు ఓ లేఖలో సమర్పించాు చిరాగ్ పాశ్వాన్ ను తమ లీడర్ గా గుర్తించాలని కోరినట్లు సమాచారం.
ఎల్జేపీలో ఐదుగురు ఎంపీల వ్యతిరేకత నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి ఢిల్లీలోని పశుపతి కుమార్ పరాస్ ఇంటికి ఆయన సోమవారం చేరుకున్నారు. పాశ్వాన్ సోదరుడు మరో ఎంపీ ప్రిన్స్ రాజ్ కూడా అక్కడే ఉన్నారు. విలేకరులతో పరాస్ సమావేశమైన కాసేపటికే పరాస్ ఇంటికి పాశ్వాన్ వెళ్లడం గమనార్హం. పరాస్ ఇంట్లో దాదాపు గంటన్నర పాటు చిరాగ్ పాశ్వాన్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన తిరిగి వెళ్లారు. ఈ విషయం గురించి మీడియాతో ఏమి మాట్లాడలేదు.