spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ కచ్చితంగా ఆ పనులు చేయగలరా?

Pawan Kalyan: పవన్ కచ్చితంగా ఆ పనులు చేయగలరా?

Pawan Kalyan: ఎన్నికల అన్నాక ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి గెలుపొందాలన్న వ్యూహంతో జగన్ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకతాటి పైకి తీసుకురావాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. విపక్షాలను దాదాపు ఏకం చేసినంత పని చేశారు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు చేయించడం విశేషం. ముఖ్యంగా కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు మొగ్గు చూపకుండా చూసే బాధ్యతను పవన్ కు అప్పగించారు చంద్రబాబు. మరోవైపు కూటమిలోకి బిజెపిని తెచ్చే బాధ్యతను పవన్ భుజస్కందాలపై పెట్టారు. ఇప్పుడు ఆ పనిలో నిమగ్నమయ్యారు పవన్. అయితే ఇందులో ఆయన కొంత సఫలీకృతులయ్యారు.

ముద్రగడ పద్మనాభం దాదాపు వైసీపీలో చేరిపోతారని ప్రచారం జరిగింది. గత ఐదేళ్లలో జగన్ కు అనుకూలమైన ప్రకటనలు చేయడంతో సామాన్యులు సైతం ఇదే భావనతో ఉన్నారు. కానీ అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం యూ టర్న్ తీసుకున్నారు. నేరుగా జనసేన కీలక నేతలు వచ్చి రెండు గంటల పాటు చర్చించడంతో ఆయన మనసు మారిందని బయటకు వెల్లడయ్యింది. కానీ తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ముద్రగడ ఏంటి? జనసేనతో చర్చలు జరపడం ఏంటి? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు. కానీ వైసీపీలో ఆశించిన స్థాయిలో ముద్రగడకు గౌరవం దక్కలేదని.. అక్కడ భంగపడ్డారని తెలుసుకున్న చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. పవన్ చే ప్రత్యేక ప్రకటన ఇప్పించారు. కాపు పెద్దల తిట్లను దీవెనలుగా మార్చుకుంటానని.. వారు వస్తానంటే ద్వారాలు తెరిచే ఉంచుతానని పవన్ ప్రకటించారు. ఈ ప్రకటనతోనే ముద్రగడ వైసీపీలోకి వెళ్లకుండా వెనక్కి తగ్గారు. జనసేన నేతలు వస్తానంటే ఆహ్వానించారు. వారితో చర్చలు జరిపారు. అదే సమయంలో టిడిపి నేత జ్యోతుల నెహ్రూను చంద్రబాబు ప్రయోగించారు. ఈ చర్చల సారాంశమే.. త్వరలో ముద్రగడతో పవన్ భేటీ.

మరోవైపు బిజెపిని కూటమిలోకి తెచ్చే బాధ్యతలను కూడా చంద్రబాబు పవన్ పై పెట్టారు. ఇప్పటికే బిజెపిలోని ప్రో టిడిపి నాయకులు తమ పని తాము చేస్తున్నారు. మరోవైపు పురందేశ్వరి సైతం తన పాత్ర వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ బిజెపి కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. వీలైనంతవరకు బిజెపి కూటమిలోకి త్వరగా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు, మూడు పార్టీల మధ్య సమన్వయం విషయంలో సైతం పవన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెర వెనుక ఉండి చంద్రబాబు ఆడిస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం జనసేనలో చేర్చగలిగితే కాపుల ఓట్లు గుంప గుత్తిగా కూటమికి పడతాయన్నది చంద్రబాబు ఆలోచన. కాపుల్లో చీలిక తెచ్చి ముద్రగడ ద్వారా కొంత నష్టాన్ని అధిగమించవచ్చని జగన్ భావించారు. కానీ ఆ క్రెడిట్ ముద్రగడకు ఇచ్చేందుకు జగన్ వెనుకడుగు వేశారు. ముద్రగడ కుటుంబానికి సీట్ల కేటాయింపు విషయంలో చికాకు తెచ్చి పెట్టారు. అదే విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పవన్ ను ప్రయోగించారు. ఒకవైపు ముద్రగడను, మరోవైపు బిజెపిని పవన్ ఆకర్షించగలిగితే ఏపీలో కూటమికి ఏకపక్ష విజయం దక్కే అవకాశం ఉంది. అయితే పవన్ ప్రయత్నాలు ఎంతవరకు కొలిక్కి వస్తాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper