West Bengal BJP: ఒకడు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తేనే చితకబాదాడు. ఈ ఎన్నికల్లో ఈవీఎం యంత్రాల మీద బిజెపి సింబల్ మీద స్టికర్ వేశాడు. చివరికి సెంటు కూడా పూశాడు. ఎన్నికల ప్రక్రియ లైవ్ స్ట్రీమింగ్ రాకుండా చూసుకున్నాడు.
ఇంకొకడు నిత్యం భారతదేశం మీద.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఇష్టానుసారంగా రాసేవాడు. ఒక పత్రికను నడిపి.. బంగ్లాదేశ్ కు అనుకూలంగా రాతలు రాసేవాడు. భారతదేశాన్ని తీవ్రస్థాయిలో విమర్శించేవాడు. నరేంద్ర మోడీ అంతమైతేనే దేశానికి పట్టిన పీడ విరగడవుతుందని చెప్పుకునేవాడు.
మరొకడు గూండారాజ్ వ్యవస్థను కొనసాగించేవాడు. మమతా బెనర్జీ.. ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీకి కుడి భుజం లాగా ఉండేవాడు. ఇంకా రకరకాల దారుణాలకు పాల్పడేవాడు.
ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వదిలి వెళ్ళిపోయారు. వారిలో కొందరు పోలీసుల చేతిలో అరెస్టు అయ్యారు. మరికొందరు సెంట్రల్ ఏజెన్సీ అధికారుల ఎంక్వైరీలో ఉన్నారు. వీరంతా గడచిన 15 సంవత్సరాల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని జలగల మాదిరిగా పట్టి పీడించారు. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పార్టీ మీటింగ్ ల పేరుతో యుక్త వయసు ఉన్న అమ్మాయిలను రోజుల తరబడి తమ వద్ద ఉంచుకునేవారు. చివరికి ఎవరైనా బిజెపి తరఫున పోటీ చేస్తే చావ బాదేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సువెందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్ని రోజులపాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా సాగిన గుండారాజ్ వ్యవస్థకు చరమగీతం పాడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు.. నాయకులు చేసిన ఆగడాలను బయటపెడుతున్నారు. బెంగాల్ రాష్ట్రాన్ని పంది కొక్కుల మాదిరిగా దోచుకున్న టీఎంసీ నేతలను శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపిస్తున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ కొడుతూ ఉన్నారు. కనీసం ఆ పార్టీ ఛాయలు కూడా వెస్ట్ బెంగాల్లో కనిపించకూడదని ప్రజలు శపథం పూనారు. ప్రజల నుంచి వస్తున్న నిరసన తట్టుకోలేక టీఎంసీ కార్యకర్తలు బిజెపి నాయకులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల నుంచి తమను కాపాడాలని విన్నవిస్తున్నారు.
బిజెపి నేతలు ప్రజలకు సర్ది చెబుతున్నారు. మన పని అది కాదని.. ఇంకా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని పూర్తిగా పునర్ నిర్మించే బాధ్యతని భుజాలకు ఎత్తుకోవాల్సి ఉందని.. చెబుతున్నారు. అయితే బిజెపి నాయకులు బయటకి అలా చెప్తున్నప్పటికీ.. మమత చేసిన 15 సంవత్సరాల కంపు తొలగించడానికి ఎన్ని స్వచ్ఛభారత్ లు నిర్వహించాలి.. ఎంతమంది సువెందు అధికారి లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకోవాలి.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బెంగాల్ గొప్పగా కనిపించకపోయినప్పటికీ.. వచ్చే రోజుల్లో మాత్రం క్లీన్ బెంగాల్ గా మారడం ఖాయం.
