Homeజాతీయ వార్తలుMamata Banerjee: ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీలు కూడా.. మమత కు బంగ్లాదేశే దిక్కు

Mamata Banerjee: ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీలు కూడా.. మమత కు బంగ్లాదేశే దిక్కు

Mamata Banerjee: మనలో ఎవరికైనా ఊహించని కష్టం ఎదురైతే.. భర్తీ చేయలేని నష్టం ఎదురైతే.. ఇక వాడి బతుకు అస్సామే అంటాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అక్కడ ఎప్పుడైతే బిజెపి అధికారంలోకి వచ్చిందో.. వరుసగా పరిణామాలు మారిపోతున్నాయి. దేశ భద్రత విషయంలో.. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ దేశస్థుల విషయంలో.. సరిహద్దుల విషయంలో.. అవినీతి అక్రమాలపై విచారణ సాగిస్తున్న విషయంలో స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయి. అందువల్లే మమతా బెనర్జీకి శంకరగిరి మాన్యాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు మొత్తం తిరుగుబాటు జెండా ప్రదర్శిస్తున్నారు. ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు వేరే దారి చూసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎంపీలు కూడా అదే దారిలో ప్రయాణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 మంది ఎంపీలు బిజెపిలోకి వెళ్తామని సంకేతాలు ఇస్తున్నారు. హై లెవెల్ చర్చలు కూడా సాగుతున్నట్టు సమాచారం.

ఒకవేళ ఆ ఎంపీలు కనుక బిజెపిలోకి వెళ్ళిపోతే మమతా బెనర్జీకి చుక్కలు కనిపించడం ఖాయం. మమతా పార్టీకి పార్లమెంట్లో 28 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని పై దారుణం జరిగింది. నాడు ఈ ఘటనపై మమత వ్యవహరించిన తీరు ఆమె ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. నాడు మమత వ్యవహార శైలిని తప్పు పట్టిన వారు ఇటీవల సువెందు అధికారి నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. వారంతా కూడా తమ బాధను చెప్పుకున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మమతా బెనర్జీ పార్టీలో చిలిక ఖాయం అన్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే మమత పార్టీ ప్రతిపక్ష నేత పదవిని కోల్పోయింది. రెబల్ నాయకుడు రుత వ్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను స్వీకరించారు. దీనికి తోడు కోల్కతా మేయర్ పదవికి పర్హద్ హకీం రాజీనామా చేశాడు. అంతేకాదు బెంగాల్ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు హాకీమ్ వెల్లడించాడు. అంతేకాదు ఈ విషయాన్ని అతడు మమతతో కూడా చెప్పాడు.

విధాన నగర్ కార్పొరేషన్ కు అక్కడి మేయర్ కృష్ణ చక్రవర్తి కూడా రాజీనామా చేశారు. ఆమె కూడా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు. కృష్ణ చక్రవర్తి దాదాపు 16 సంవత్సరాలుగా ఈ పదవిలోనే ఉన్నారు. తాను సాధారణ కౌన్సిలర్ గా ఉంటున్నానని.. తన రాజీనామా విషయంలో ఎవరివతుడు లేదని కృష్ణ చక్రవర్తి ఈ సందర్భంగా వెల్లడించడం విశేషం. ఇలా పార్టీ మొత్తం ముక్కలు అవుతున్న నేపథ్యంలో మమతకు బంగ్లాదేశే దిక్కని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సక్రమంగా పరిపాలన సాగించి ఉంటే మమతా బెనర్జీకి ఈ కష్టం వచ్చేది కాదని వారు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular