
కేవలం ఒక్క గంటలో రూ.73 వేల కోట్ల భారీ నష్టం అంటే మామూలు విషయం కాదు. ఒక్క స్టాక్ మార్కెట్ లోనే ఇలాంటివి జరుగుతుంటాయి. అదానీ గ్రూపు కంపెనీల షేర్లు పడిపోవడం ఇందుకు ప్రధాన ప్రధాన మార్కెట్ ఇదే. అదానీ గ్రూపు ఫౌండర్ గౌతమ్ అదానీ కేవలం ఒక్క గంటలోనే రూ.73 వేల కోట్లు నష్టపోయారు. దాదాపు 10 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.
అదానీ గ్రూపు షేర్లు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం శుక్రవారం రోజు అదానీ సంపద విలువ 77 బిలియన్ డాలర్లుగా ఉండేది. మన కరెన్సీలో రూ.5.64 లక్షల కోట్లు. అదే సమయంలో అదానీ గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లుగా ఉంది. దీంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే రెండో అతిపెద్ద సంపన్నుడిగా కొనసాగుతున్నారు.
అయితే ఈరోజు ఆ స్థానం నుంచి అదానీ కిందకు జారిపోయి ఉండొచ్చు. దీనికి కారణం అదానీ షేర్లు సోమవారం పతనం కావడం. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్ డీఎల్) మూడు ఫారిన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ సీఐ) అకౌంట్లను స్తంబింపజేసింది. ఇవి అదానీ గ్రూపుకు చెందిన 4 లిస్టెడ్ కంపెనీల షేర్లను కలిగి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అదానీ గ్రూపు కంపెనీ షేర్లు పతనమయ్యాయి.
అబ్బులా ఇన్వెస్ట్ మెంట్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అకౌంట్లను ఎన్ఎస్ డీఎల్ స్తంభింపజేసింది. వీటిల్లో రూ.43,500 కోట్ల విలువైన అదానీ ఎంటర్ ప్రైజెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్ మిషన్ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఉన్నాయి. ఎన్ఎస్ డీఎల్ ఖాతాల స్తంభన నేపథ్యంలో పలు అదానీ కంపెనీ షేర్లు అమ్మడం లేదా కొనడం జరగదు. దీంతో షేర్లు నష్టపోయాయి.