Homeజాతీయ వార్తలుLok Sabha Election Results 2024: అయోధ్య సెంటిమెంట్ బీజేపీకి ఎందుకు కలిసి రాలేదు..?

Lok Sabha Election Results 2024: అయోధ్య సెంటిమెంట్ బీజేపీకి ఎందుకు కలిసి రాలేదు..?

Lok Sabha Election Results 2024: దాదాపు 500 సంవత్సరాలకు పైగా వివాదంలో ఉన్న అయోధ్య రామ జన్మభూమి సమస్య 2023లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో సమసిపోయింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టను దేశమే కాదు యావత్ ప్రపంచం భక్తి భావంతో చూసింది. ప్రపంచంలోని ప్రతీ చిన్న దేశం, ఇతర మతాలైన క్రిస్టియన్, ముస్లిం ప్రాభవం ఉన్న దేశాలు కూడా రాముడిని భక్తితో ప్రార్థించాయి. రాముడికి కోవెల కట్టడంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు భక్తి భావంతో ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. దేశానికి ఇంతటి ఖ్యాతి, కీర్తి తెచ్చిన అయోధ్య కేంద్రంగా ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటును బీజేపీ కోల్పోవడంతో ప్రతీ ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత చరిత్ర..
ఫైజాబాద్ (అయోధ్య) ఎంపీ స్థానంలో బీజేపీ లల్లూ సింగ్ ను బరిలో నిలిపింది. 2014, 2019లో వరుసగా రెండు సార్లు గెలిచిన లల్లూ సింగ్ హ్యాట్రిక్ సాధిస్తారని గట్టి నమ్మకం పెట్టుకుంది. 2019లో దాదాపు 50 శాతం ఓట్లతో 65,477 ఓట్ల మెజార్టీతో లల్లూ గెలుపొందారు. 2019లో మొత్తం 1087121 ఓట్లు పోలవగా అందులో 529021 ఓట్లను లల్లూ సింగ్ తన ఖతాలోకి మళ్లించుకున్నాడు.

ఇక 2024 విషయానికి వస్తే లల్లూ సింగ్ ఓటమి పాలయ్యారు. లల్లూ సింగ్ కు అపోజిట్ గా సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) అవదేశ్ ప్రసాద్ ను బరిలోకి దింపింది. గతంలో బీఎస్పీ, ఎస్‌పీ కలిసి పోటీ చేయగా.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఈసారి మాత్రం ఎస్‌పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. దీంతో గతంలో కంటే బీజేపీకి 5 శాతం ఓట్లు తగ్గి బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ ఓటమి పాలయ్యాడు.

ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే
పార్టీ అభ్యర్థి సాధించిన ఓట్లు
ఎస్‌పీ అవదేశ్ ప్రసాద్ 552177
బీజేపీ లల్లూ సింగ్ 497825
బీఎస్పీ.. సచ్చిదానంద్ పాండే 45993
సిపిఐ అరవింద్ సేన్ 15347
స్వతంత్ర సునీల్ కుమార్ 3814
స్వతంత్ర జగత్ సింగ్ 1248

ఫైజాబాద్ లోక్ సభ చరిత్ర
ఫైజాబాద్ పార్లమెంట్ స్థానంగా అవతరించినప్పటి నుంచి కాంగ్రెస్ 7 సార్లు, బీజేపీ 4 సార్లు, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, సీపీఐ ఒక్కోసారి విజయం సాధించాయి. రెండు పర్యాయాలుగా ఈ స్థానాన్ని బీజేపీ గెలుస్తూ వస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ఆనంద్ సేన్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ విజయం సాధించారు. లల్లూ సింగ్ కు 5.29 లక్షల ఓట్లు రాగా, ఆనంద్ కు 4.63 లక్షల ఓట్లు వచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ ఎస్పీ అభ్యర్థి మిత్రసేన్ యాదవ్ పై విజయం సాధించారు. లల్లూ సింగ్ కు 4.91 లక్షల ఓట్లు రాగా, మిత్రసేన్ కు 2.08 లక్షల ఓట్లు వచ్చాయి.

కుల సమీకరణం
ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, వీటిలో నాలుగు (దరియాబాద్, రుదౌలి, బికాపూర్, అయోధ్య) ఇవన్నీ బీజేపీ ఆధీనంలో ఉండగా, ఒకటి (మిల్కీపూర్) ఎస్పీకి చెందిన అవధేష్ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఫైజాబాద్ నియోజకవర్గంలో 84 శాతం హిందూ ఓటర్లు ఉండగా, ఓబీసీ ఓటర్లు 26 శాతం ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు 13 శాతం ఉన్నారు. కొన్నేళ్ల క్రితం యోగి ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా మార్చింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular