Homeజాతీయ వార్తలుకరోనా లాగే.. భయపెడుతున్న మరో కొత్త వ్యాధి

కరోనా లాగే.. భయపెడుతున్న మరో కొత్త వ్యాధి

దేశంలోనే మొట్టమొదటి కరోనా వైరస్ కేసు వెలుగుచూసింది కేరళ రాష్ట్రంలోనే.. చైనా నుంచి వచ్చిన ఓ విద్యార్థికి ఈ వ్యాధి సోకింది. అయితే కరోనాను ఇప్పుడు కేరళ పూర్తిగా నియంత్రించగలిగింది. అయితే అదే రాష్ట్రంలో మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది. కేరళ కోవిడ్ -19తో పోరాడుతుండగానే.. కొత్త బ్యాక్టీరియా ఆ రాష్ట్రంలో పుట్టుకొచ్చి ప్రజలకు వ్యాపిస్తూ భయపెడుతోంది.

11 ఏళ్ల బాలుడికి ఈ కొత్త బ్యాక్టీరియా వ్యాధి సోకి మరణిచండంతో వెలుగులోకి వచ్చింది. అతడితో సన్నిహితంగా ఉన్న చాలామందికి ఇప్పుడు ఈ లక్షణాలు వచ్చాయి..

కేరళలో వ్యాపిస్తున్న బ్యాక్టీరియా పేరు ‘షిగెల్లా’.వ్యాధి సంక్రమణను షిగెలోసిస్ అంటారు. దీని లక్షణాలు ఏంటంటే.. విరేచనాలు, జ్వరం, కడుపు తిమ్మిరిగా ఏడు రోజులపాటు ఉంటాయి. యాంటీబయాటిక్స్ ద్వారా దీనికి చికిత్స చేస్తారు. ఇది మనుషులను అనారోగ్యం బారినపడేసి ప్రాణాలను కబళిస్తుంది. షిగెల్లా బ్యాక్టీరియా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వివిధ మార్గాల ద్వారా వ్యాపిస్తుంది – సోకిన వ్యక్తి విరేచనాలు నయం అయిన తరువాత కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తేలింది. కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. మలం పరీక్ష ద్వారా బ్యాక్టీరియా ఉనికిని సాధారణంగా నిర్ధారిస్తున్నారు.

కోవిడ్ -19 విషయంలో మాదిరిగా, సరైన పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాధిని నివారించవచ్చు. చేతులు సరిగ్గా కడుక్కోవడం బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. బ్యాక్టీరియా ఉపరితలాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది – సోకిన ఉపరితలాన్ని తాకడం మరియు తరువాత నోటిని తాకడం – కానీ వ్యాధి సోకిన ఎవరైనా తయారుచేసిన ఆహారాన్ని తినడం నుండి కూడా సంక్రమిస్తుంది.

అన్ని వయసుల వారికి ఈ వ్యాధి సోకుతోంది. పిల్లలకు మాత్రం ఇంకా వేగంగా వ్యాధి సోకుతుందని తేలింది. కేరళలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా పిల్లలకే సోకింది. 11 ఏళ్ల బాలుడు మరణించాడు. అతడితోపాటు సన్నిహితంగా ఉన్న వారు ఈ వ్యాధి బారినపడ్డారు. సోకిన వారితో లైంగిక సంబంధం కూడా వ్యాధికి కారణమవుతుంది.

కేరళలో ఈ వ్యాధి బయటపడడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో కోయిలాండిలో బ్యాక్టీరియా కనుగొనబడింది, దీని తరువాత పాఠశాలల్లో ఈ వ్యాధి వ్యాపించింది. మధ్యాహ్నం భోజనంలో అపరిశుభ్రత వల్ల కీజ్‌ప్పయ్యూర్‌లోని వెస్ట్ లోయర్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన 40 మంది పిల్లలు ఇలాంటి లక్షణాలతో 2019 లో ఆసుపత్రి పాలయ్యారు.

కేరళలోని ఆరోగ్య అధికారులు ప్రస్తుత వ్యాధి వ్యాప్తిని పరిశీలిస్తున్నారు. స్థానిక నీటి వనరులను శుభ్రపరుస్తున్నారు, ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఏదో ఒకవిధంగా 11 ఏళ్ల బాలుడితో సన్నిహితంగా ఉన్నట్లు కనుగొన్నారు.. వారు బాలుడి అంత్యక్రియలకు హాజరయ్యారని.. విందులో ఆహారం తీసుకున్నారని గుర్తించారు. ఈ కొత్త వ్యాధిని అరికట్టడానికి కేరళ సర్కార్ రంగంలోకి ఆ ఊళ్లో ఒక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ చికిత్స చేస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular