Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకున్నారు. జులై 8న వైఎస్సార్ రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్ణయించింది. వంద ఇంటిగ్రేటెడ్ అక్వా ల్యాబ్ ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది.

640 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావించింది. రాష్ర్ట వ్యాప్తంగా 45 కొత్త రైతు బజార్లను ఏర్పాుట చేయాలని సూచించింది. ఆర్బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఊటుకూరులో నాటుకోళ్ల హేచరీస్ ఏర్పాటు చేయాలని తెలిపింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని తేల్చింది.

రూ.89 కోట్లతో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలు, వైఎస్సార్ బీమా పథకానికి ఆమోదం, మౌలిక వసతుల కల్పనకు రూ.34 వేల కోట్లు ఖర్చు. అమ్మఒడి డబ్బులు వద్దనుకుంటే ల్యాప్ టాప్, రూ.339 కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు, జులై 1,3,4 తేదీల్లో జరగనున్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపన, ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.1.80 లక్షల సాయం.

ఇళ్ల స్థలం పొందిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు, విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తూ నిర్ణయం, మధ్యతరగతి ప్రజల కోసం జరగనున్న టౌన్ షిప్ ఏర్పాటు, లాభాపేక్ష లేకుండా నగరాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాల సేకరణ, మధ్య తరగతి ప్రజలకు కేటాయింపు, వ్యవసాయేతర ఆస్తులకు పట్టాదారు పాసుపుస్తకం, కాకినాడ సెజ్ లో 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం, పీహెచ్ సీల కోసం 539 కొత్తగా 104 వాహనాల కొనుగోలుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular