అభిమానానికి పైత్యానికి రానురాను అర్ధాలు ఒక్కటే అయిపోతున్నాయి. లేకపోతే, ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ కావడం లేదని నిరాహార దీక్ష చేయడం ఏమిటి ? ఇలాంటి పిచ్చి ఫ్యాన్లు కూడా మనం ఉన్న ఈ సమాజంలో ఉన్నారా ? అని ఆశ్చర్యపోతూ అతని పైత్యానికి బిత్తర చూపులు చూస్తున్నారు నెటిజన్లు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాని ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఓ ఆలోచనకు వచ్చారు.
ఐతే వెంకీ అభిమానులు ఓటీటీ రిలీజ్ పై అసంతృప్తిగా ఉన్నారు, తమ నిరుత్సాహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచారు, తప్పు లేదు. కానీ వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సురేష్ బాబు సుముఖంగా ఉన్నాడంటూ వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ కొత్తగా కాదు, చెత్తగా తన నిరాశను బయట పెట్టాడు.
ఇంతకీ అతను ఏమి చేశాడంటే.. ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టి, తానేదో దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తోన్న వాడిలా తెగ ఫోజు ఇస్తూ సోషల్ మీడియాలో తన ఫోటో కూడా షేర్ చేశాడు కిరణ్. పనిలో పనిగా వెంకీ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలంటూ ఒక కాగితం పై నాలుగు ముక్కలు కూడా రాసుకుని బాగానే హడావిడి చేయడానికి కసరత్తులు చేశాడు.
A protest against… #Narappa OTT release by @VenkyMama Fan
Please @SBDaggubati Sir..
We demand @SureshProdns #WeWantNarappaInTheatres@Alludukiran2@theVcreations pic.twitter.com/Mhjeh6TPHT— Krish Narappa (@Krish_kaval) June 29, 2021
కానీ, ఈ పిచ్చి పనికి ఆదరణకు బదులు హేళనలు మొదలయ్యాయి. అయితే, అతగాడు ఫ్లకార్డు పట్టుకుని నిలుచున్న ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. అయినా ఇలాంటి పనికిరాని వాటిని ప్రమోట్ చేయడానికి కొన్ని సైట్లు ఎప్పుడు తెగ ఉబలాట పడుతూ ఉంటాయి కదా, అందులో భాగంగా ఈ నిరాహార దీక్ష ఫోటో కూడా వైరల్ గా మారి నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. మరి తన అభిమాని వెర్రి చేష్ట పై వెంకటేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More