Homeజాతీయ వార్తలుదేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం?

దేశవ్యాప్త రైతు ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం?

CMKCRరైతులంటే కేసీఆర్ కు ప్రాణం.. స్వయంగా ఆయనో రైతు కూడా.. రైతు కష్టాలు తెలిసే.. వారికి తెలంగాణలో ఉచిత విద్యుత్తు.. సరిపడా ఎరువులు , విత్తనాలు.. వాళ్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎన్నో కట్టాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎజెండానే రైతు సంక్షేమం. అలాంటి రైతుల గొంతు కోస్తున్న వ్యవసాయ, విద్యుత్ బిల్లులపై ఇప్పుడు దేశమంతా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్, హర్యానా… బీజేపీ పాలనలో ఉన్న కర్ణాటకలోనూ రైతులు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంపై రైతులంతా ఆగ్రహంగా ఉన్న వేళ వారి తరుఫున దేశవ్యాప్త రైతు ఉద్యమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నడుం బిగించినట్లు సమాచారం.

Also Read: సీఎం జగన్ పై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ

తెలంగాణలో 92.05 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని.. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లు రైతుల మెడపై కత్తిపెట్టేలా ఉన్నాయనే వాదన టీఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రైతుల శ్రేయస్సు కోసం జాతీయ ఉద్యమం దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తలసాని మాటలను బట్టి తెలుస్తోంది.

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి.వీటిని క్యాష్ చేసుకోవడానికి కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. తద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని.. పీఎం సీటుకు చేరువ కావచ్చన్న ప్లాన్ సాగుతోంది.

ఇప్పటికే కేంద్రం వ్యవసాయ బిల్లుపై రాజ్యసభ అట్టుడికింది. రచ్చ చేసిన ఎంపీలను బీజేపీ సర్కార్ సస్పెండ్ చేయించింది. వాళ్లు రాత్రంతా పార్లమెంట్ వద్దే నిరసన తెలిపారు. దీంతో రైతు ఉద్యమం దిశగా కేసీఆర్ అడుగులు వేసి దేశంలోని ప్రతిపక్షాలు, రైతులను ఆకర్షించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి తలసాని హాట్ కామెంట్స్ చేశారు. ‘ఇప్పటిదాకా రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు. రైతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న బీజేపీ శిక్ష అనుభవించక తప్పదు. అవసరమైతే రైతుల ఉద్యమానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహిస్తారు’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాగా వ్యవసాయ బిల్లులకు ఆమోదం పొందడం ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ఇష్టం లేదని.. అందుకే ఆయన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు సభలో లేరని తలసాని వ్యాఖ్యానించారు.జీఎస్టీ సహా అన్నింట్లోనూ రాష్ట్రాలను కేంద్రం మోసం చేసిందని ఇక కేంద్రం ఆటలు తెలంగాణలో సాగవని తలసాని స్పష్టం చేశారు.

Also Read: జగన్‌ ను వాడుకుంటున్న కేంద్రం

విద్యుత్ బిల్లు, వ్యవసాయ బిల్లులపై ఉద్యమించడానికి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు తలసాని ముందుగా హిట్ ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular