spot_img
Homeజాతీయ వార్తలుKCR in tension: టెన్షన్లో కేసీఆర్.. పార్లమెంట్ కు ఎంపీల డుమ్మా..!

KCR in tension: టెన్షన్లో కేసీఆర్.. పార్లమెంట్ కు ఎంపీల డుమ్మా..!

KCR in tension: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు అంశంపై ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్లకార్డులు, నినాదాలు, వాకౌట్లతో టీఆర్ఎస్ ఎంపీలు నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే ఉన్నట్టుండి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

KCR in tension
Winter Session of Parliament 2021

తెలంగాణలోని ప్రతీ ధాన్యపు గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తుండంతో టీఆర్ఎస్ ఎంపీలు నేడు పార్లమెంట్ కు వెళ్లలేదని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను సీఎం కేసీఆర్ స్థానిక ఎంపీలకే అప్పగించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే వారంతా పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొట్టి ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగీవ్రం అయ్యాయి. నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నిక జరుగాల్సి ఉండగా కరీంనగర్లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా జిల్లాలో టీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఆపార్టీకి ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఎంపీసీటీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల ఓటు కీలకమే కానుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్ తన సత్తా ఏంటో టీఆర్ఎస్ కు రుచిచూపించాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలు ఆపార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను క్యాంపులకు తరలిస్తున్నారు.

Also Read: మమత, అఖిలేశ్ కూట‌మిలో కేసీఆర్ ను పీకే చేర్చుతాడా..?

ఇప్పటికే పలువురు ఎంపీలు ఆపార్టీకి చెందిన ఓటర్లను గోవా, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ సర్కారు నిధులు కేటాయించకపోవడంపై ఆపార్టీకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు సైతం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోది. దీంతో వీరిని బుజ్జగించడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది.మరోవైపు ప్రత్యర్థి పార్టీలు సైతం ఆశావహులను తమవైపు తిప్పుకుంటుండంతో టీఆర్ఎస్ ఎంపీలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో నాలుగురోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే టీఆర్ఎస్ ఎంపీలు యథావిధిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. మళ్లీ వారంతా కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకోవడంతో ఆపార్టీ నేతలు పార్లమెంట్ కు డుమ్మా కొట్టారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

Also Read: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper