Homeజాతీయ వార్తలుదిద్దుబాటు చర్యలకు దిగిన కేసీఆర్‌‌ సర్కార్‌‌

దిద్దుబాటు చర్యలకు దిగిన కేసీఆర్‌‌ సర్కార్‌‌

KCR Sarkar
గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉద్యోగులను ఏ స్థాయిలో పీడించాడో అందరికీ తెలిసిందే. తర్వాత ఆయనకు వాళ్లే బుద్ధి చెప్పారనేది సుస్పష్టం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ చేస్తోంది అదే. ఉద్యోగులతో పెట్టుకుంటేనే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి ఎదురైందనేది ఓ టాక్‌. వారితో పెట్టుకున్న పాపమే ఈ రిజల్ట్‌ అని బహిరంగంగా ఉద్యోగులు తిట్టిపోస్తున్నారు.

Also Read: ఇంతకీ తెలంగాణలో జనసేన అధినేత ఎటువైపు..?

ఇటీవల రెవెన్యూ వ్యవస్థను భారీ ఎత్తున ప్రక్షాళన చేశారు. అందులో భాగంగా ఏకంగా వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికారు. ఆ నిర్ణయంతో తెలంగాణలోని అవినీతిని మొత్తం ఏరిపారేసినట్టు భారీ డైలాగులు కొట్టారు. సామాన్య ప్రజానీకంలో కొంతమంది ఈ నిర్ణయంతో సంతోషపడొచ్చు కానీ.. వారికిది ఓట్లు త్యాగం చేసేంత పెద్ద సంగతేం కాదు. అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధుగణం.. అందరూ కేసీఆర్‌‌కు బద్ద శత్రువుల్లా మారిపోయారు.

తమ జీవితంలో ఇక టీఆర్‌‌ఎస్‌కు ఓటు వేసేది లేదంటూ డిసైడ్‌ అయిపోయారు. ఆ స్థాయిలో శత్రుత్వం పెంచుకున్నారు. ఇదంతా మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో చూపించారు కూడా. అధికార పార్టీ అలసత్వానికి ఇది పరోక్షంగా తోడై సింపతితో సింపుల్ గా గెలవాల్సిన సీటుని చేజార్చింది. అయితే.. ఇప్పుడా పాపాన్ని కడిగేసుకోడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందట.

Also Read: గ్రేటర్ నజర్: కేసీఆర్ అలెర్ట్.. భారీగా పోలీసుల బదిలీలు

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. రెవెన్యూలో ఉన్న అసంతృప్తిని మున్సిపల్ ఉద్యోగులకు వరాలిచ్చి భర్తీ చేయాలని చూస్తోందని టాక్‌. పారిశుధ్య సిబ్బందికి అడక్కుండానే నెల జీతం 3 వేల రూపాయలు పెంచడాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా చూడాల్సి వస్తోంది. ఒక్క ఉద్యోగులకు వరాలిస్తే మిగతా వారి పరిస్థితి ఏంటి అనుకున్నారేమో.. వరదసాయం మరో 100 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నారు. మీ సేవా కేంద్రంలో పేరు, ఇంటి నెంబర్, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇస్తే చాలు.. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఖాతాల్లో నేరుగా పరిహారం సొమ్ము జమ అవుతుందట.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

కార్పొరేటర్లు, కార్యకర్తల చేతికి ఇచ్చి పంచిపెట్టిన వ్యవహారం బెడిసి కొట్టడంతో నేరుగా ఇలా ఎన్నికల ముందు పాప పరిహారాన్ని ఓటర్ల అకౌంట్లకే బదిలీ చేస్తున్నారనమాట. వీటితోపాటు ఏడాది ఆస్తిపన్నులో 50 శాతం రాయితీగా ప్రకటించేసింది. మధ్యతరగతి ప్రజలకు ఇది భారీ ఊరట కలిగించే అంశం. మొన్నటి దుబ్బాక ఫలితంగా గ్రేటర్‌‌లో రిపీట్‌ కాకుండా సర్కార్‌‌ ఇప్పటి నుంచే తాయిలాలు ప్రకటిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ జిమ్మిక్కులన్నీ చేస్తోందని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular