Homeఎన్నికలుబిజెపి గెలుపుపై కవిత వింత వాదన

బిజెపి గెలుపుపై కవిత వింత వాదన

kavitha

ఏదైనా ఎన్నికలు జరిగి ఆశించిన ఫలితాలు రానప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యం. ఎన్నికలలో వారి పేలవమైన లేదా మెరుగైన పనితీరుకు గల కారణాలను విశ్లేషించుకోవడం చాలా సాధారణం.

Also Read: రేపే టీపీసీసీ ప్రకటన.. రేసులో ఇద్దరు నేతలు?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లను సాధించింది. ఈసారి కేవలం 55 కి పడిపోయింది.

టిఆర్ఎస్ నష్టం బిజెపికి లాభమైంది. నాలుగు సీట్ల నుంచి 48కి బీజేపీ పెరిగింది. ఇది కాషాయ పార్టీ చేసిన అద్భుతమైన ప్రదర్శన. ఈ ఊపులో ఇప్పుడు తదుపరి అసెంబ్లీ ఎన్నికలలో బలంగా పోరాటానికి బీజేపీకి ఊపిరినిచ్చింది.

టిఆర్ఎస్ దాని పతనానికి కారణాలను విశ్లేషించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది..తన తప్పులను అంగీకరించి, కోలుకోవడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అయితే పార్టీ తప్పులను అంగీకరించడానికి బదులుగా.. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేకర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఒక వింత వాదనను తెరపైకి తీసుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత బిజెపి విజయాన్ని పక్కన పెట్టాలని కోరడం విశేషం. బిజెపి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయకులతో పరేడ్ నిర్వహించి ఓటర్లను గందరగోళపరిచిందని కవిత విమర్శించింది.

Also Read:  గ్రేటర్ ‘ఫజిల్’.. మేయర్ కోసం అసెంబ్లీ సీట్లను త్యాగం చేస్తారా..!

“ప్రతిచోటా దూకుడుగా వెళ్లడం బిజెపి వ్యూహం. మేము బిజెపి వ్యూహాలను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎదుర్కొన్నట్టుగానే 2023 లో ఒక అడుగు ముందుగానే వేస్తాం. ఖచ్చితంగా బీజేపీని ఓడిస్తాం “అని కవిత చెప్పుకొచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో బిజెపి గెలుపును ఆపామని కవిత సమర్థించుకోవడం విశేషం. “బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని మేము ఆపగలిగాము. మిగతా పార్టీలన్నీ టిఆర్ఎస్ నుండి నేర్చుకోవచ్చు. బిజెపిని ఆపడానికి హైదరాబాద్ మార్గం చూపించింది” అని కవిత పేర్కొన్నారు.

“మేము బలహీనమైన పార్టీ కాదు. 60 లక్షల మంది సభ్యులతో చక్కటి వ్యవస్థీకృత పార్టీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఒక అడుగు ముందుగానే ఉన్నామని నిర్ధారించుకోవడానికి ఇప్పటి నుంచే తిరిగి పోరాడతాము”అని కవిత అన్నారు. దీన్ని 2023 లో టిఆర్ఎస్ కు బీజేపీ పెను ముప్పుగా ఉండబోతోందని పరోక్షంగా కవిత అంగీకరించినట్టైంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular