Jaggareddy Bandi sanjay: ‘పెట్రో, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న మోడీని అడిగే మొగతనం… దమ్ము నీకు ఉందా బండి సంజయ్’ అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల మీద డీజిల్ ధరలు.. పెట్రోల్..గ్యాస్ ధరల భారం మోపింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. . ఈ మూడింటికి సమాధానం చెప్పే ధైర్యం.. దమ్ము.. మొగతనం ఉందా అని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీలు కలిసి కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకొని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. . టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు.. బీజేపీ పొందే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మోడీ కుట్రలో కేసిఆర్, రాష్ట్ర బీజేపీ.. షర్మిల భాగస్వామ్యులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీఎస్ఎన్ఎల్, ఎల్.ఐసీ లాంటి సంస్థలు అమ్ముతున్న బీజేపీపై సంజయ్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ని జైల్లో పెడతా అని అధ్యక్షుడు అయినప్పటి నుండి అంటున్నారు… కానీ జైలుకు పంపరని అన్నారు. ప్రజలకు ధరలు పెంచి సమస్యలు సృష్టించింది మీరేనని మండిపడ్డారు.
నిజాం భూములకు.. పాదయాత్ర కు సంబంధం ఏముందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా…నిజం భూములు ఉంటే ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. నిజాం పేరు తెచ్చి మతతత్వ రాజకీయాలు తెచ్చే డ్రామా కు తెర లేపారన్నారు. నిజాం భూములు తీసుకునే ధైర్యం ఉంటే… కేంద్రంలో మీరే అధికారం లో ఉన్నారు కదా తీసుకో మరి అని కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ కూడా పాదయాత్ర చేస్తుందని.. మా పాదయాత్రలో బీజేపీ కొట్టుకుపోతుందన్నారు. రేవంత్..నేను.. కోమటిరెడ్డి అందరు పాదయాత్ర చేస్తారన్నారు. మా వ్యూహం ఇప్పుడే చెప్పమన్నారు. నాలుగు దిక్కులా నుండి పాదయాత్ర చేస్తామా..? ఒక్కరే చేస్తారా అనేది చెప్తామన్నారు. నెక్స్ట్ మీటింగ్ లో పాదయాత్ర లను ప్రస్తావిస్తామన్నారు. ప్రైవేటు అస్తి గుంజుకొగలుగుతమా అని అన్నారు. ఎంపి సంజయ్ కి ఆ మాత్రం తెలివి లేదా..? అని నిలదీశారు.
విజయమ్మ కొత్త నాటకానికి తెర లేపారని.. వైఎస్ పేరు చెప్పుకుని ఏపీలో జగన్ నీ కుర్చిమీద కూర్చోపెట్టుకున్నారని.. షర్మిల తెలంగాణకు కోడలే… మరి విజయమ్మ ఏం అవుతుందని జగ్గారెడ్డి నిలదీశారు.
భారత దేశం హిందూ దేశం అని.. హిందూ దేశం బండి సంజయ్ పుట్టిన తర్వాత నా? మోడీ పుట్టిన తర్వాతే పుట్టిందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హిందూ పార్టీ అయితే… 85 శాతం మంది హిందువులు మీరు పెంచిన ధరల తో ఇబ్బంది పడుతున్నారా లేదా అని నిలదీశారు. బండి నువ్వు హిందువు అయితే.. పెంచిన ధరలు తగ్గిస్తవా..? అని మండిపడ్డారు. నీది ఒరిజినల్ రక్తమే కదా… కల్తీ రక్తం కాదు కదా..? అని నిప్పులు చెరిగారు.
ఎంపి అరవింద్ కి..బుర్ర లేదు..సంజయ్ కి జ్ఞానం లేదని జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. అరవింద్ రక్తం కాంగ్రెస్ ది. సమస్యలు పక్కన పెట్టి..ఎమోషనల్ పాలిటిక్స్ తెర మీదకు తెస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో యువతను కూడా మతతత్వ రాజకీయాలకు వాడుతున్నారు. బీజేపీ..ఎంఐఎం రెండు గంజాయి మత్తు లో ఉన్న యువతను వాడుకుంటున్నాయని జగ్గారెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ లను కడిగిపారేశారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Jaggareddy serious comments on bandi sanjay
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com