Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: తిడితే ఊరుకుంటారా? వైఎస్ షర్మిలకు ఇలా షాకిచ్చారు

YS Sharmila: తిడితే ఊరుకుంటారా? వైఎస్ షర్మిలకు ఇలా షాకిచ్చారు

YS Sharmila: ఎన్నికల ముంగిట తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు విస్తృతమయ్యాయి. మంగళవారం ప్రముఖుల ఇళ్లతో పాటు వారి సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ హోటల్ సంస్థ చట్నీస్ కు ఐటీ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాదులోని చట్నీస్ హోటల్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. సోదాలు జరిపారు. చట్నీస్ హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే అట్లూరి పద్మ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వియ్యంకురాలని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇదో ప్రాధాన్యత అంశంగా మారింది.

కొద్ది రోజుల కిందట షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో రాజస్థాన్లోని జోద్పూర్ ప్యాలెస్ లో వివాహ వేడుకలు ఘనంగా జరిపారు. చట్నీస్ హోటల్స్ అధినేత కుమార్తె ప్రియా అట్లూరి అని తెలుస్తోంది. హైదరాబాదులోని చెట్నీస్ హోటల్స్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ హోటల్కు బ్రాంచ్ లు ఉన్నాయి. గత పది సంవత్సరాలుగా చట్నీస్ పేరుతో అట్లూరి పద్మ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల బిజినెస్ టర్నోవర్ అవుతోంది. ఈ క్రమంలో ఐటీ దాడులు జరగడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల కార్యాలయాలపై మంగళవారం ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. ఇది వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. చట్నీస్ సంస్థ పై జరిగిన దాడుల విషయం బయటకు రాలేదు. అటు యాజమాన్యం ప్రత్యేక ప్రకటన విడుదల చేయలేదు. ఈ దాడుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. షర్మిల రాజకీయంగా దూకుడుగా సాగుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిలకు బంధువుగా భావిస్తున్న పద్మ అట్లూరి చట్నీస్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతుండడం విశేషం. అయితే గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ సమయంలో చట్నీస్ సంస్థ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. షర్మిల కోడలు ప్రియా అట్లూరితో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం షర్మిలపై ఉన్న కోపంతో ఆమె వియ్యపురాలు పద్మ అట్లూరి సంస్థలపై ఐటి దాడులు చేయిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular