spot_img
Homeజాతీయ వార్తలుInter board: ఇంటర్ బోర్డు నిర్వాకం.. విద్యార్థులకు శాపం.. తగ్గిన ఉత్తీర్ణత శాతం

Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం.. విద్యార్థులకు శాపం.. తగ్గిన ఉత్తీర్ణత శాతం

Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలవడం దానికి రివాజే. ఇందులో భాగంగానే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వద్దని ఎంత మంది చెప్పినా వినకుండా నిర్వహించి విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటోంది. ఉత్తీర్ణతా శాతం తగ్గడంతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెబుతారు. సంబంధిత శాఖ మంత్రా? ప్రజాప్రతినిధులా? ప్రభుత్వమా? ఎవరు విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపుతారు? బాగా చదివే విద్యార్థులు కూడా ఫెయిల్ కావడం విచిత్రమే.

Inter Board
Inter Board

కరోనా ప్రభావంతో రాష్ర్టవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నిర్వహణ సరిగా లేకుండా పోయింది. దీంతో అందరు ఆన్ లైన్ తరగతులతోనే కాలం వెళ్లదీశారు. ఏదో ఒకటి రెండు నెలలు తరగతులు నిర్వహించడంతో పరీక్షలు నిర్వహించడానికి ఉత్సాహం చూపడం ఇంటర్ బోర్డు అత్యుత్సాహమే అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ లో మార్కులు తక్కువగా రావడంతో విద్యార్థుల ఆందోళన రెట్టింపయింది.

ప్రస్తుతం పరీక్షలు నిర్వహించి ఏం సాధించారు? మార్కులు తక్కువగా వచ్చి ఫెయిలయినందుకు విద్యార్థులు ఓ పక్క వెక్కివెక్కి ఏడుస్తుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకునే హక్కు ప్రభుత్వానికి లేదని విద్యార్థి సంఘాలు సైతం రోడ్డెక్కాయి. ఈనేపథ్యంలో విద్యార్థులను నట్టేట ముంచే కార్యక్రమంలో భాగంగానే పరీక్షల నిర్వహణకు పూనుకుందనే వాదనలు సైతం బలంగా వస్తున్నాయి.

Also Read: Congress Leaders: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమేనా?

ఇంతకీ ఫెయిలయింది విద్యార్థులా? ప్రభుత్వమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఉత్తీర్ణతా శాతం పడిపోవడంతో విద్యార్థుల్లో కంగారు మొదలైంది. ఇంత దారుణం జరగడానికి కారణం ఇంటర్ బోర్డే అని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కూడా ఏం మాట్లాడకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం గమనార్హం.

Also Read: Telangana: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper