
గత కొద్దీ రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో, ముఖ్యంగా పాతబస్తీలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ పాతబస్తీలో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు.
కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను క్రమంగా కంటైన్మెంట్ జోన్లు నుంచి ఎత్తివేసి ఇక పాతబస్తీపై దృష్టి సారించాలని వైద్యాధికారులు నిర్ణయించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ ఉధృతిని బట్టి 141 కంటైన్మెంటు జోన్లుగా విభజించారు. వాటిలో మర్కజ్ వెళ్లిన నివసించే ప్రాంతాలను రెడ్జోన్గా చేసి ఆ ప్రాంతాల వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రహదారులపై 8మీటర్ల ఎత్తులో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జీహెచ్ఎంసీ, వైద్యశాఖ, పోలీసు అధికారులు ఇంటింటికి తిరిగి అనుమానితులు కనిపిస్తే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడం, చుట్టుపక్కల వారిని హోం క్వారంన్లో టైఉంచి ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహించడం చేస్తున్నారు.
గత రెండు వారాలకు పైగా కాలం నుంచి అధికారులు కంటైన్మెంట్ ప్రాంతాలను పెద్ద ఎత్తున జల్లెడ పట్టడంతో ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 542 కేసులు నమోదయ్యాయి. అందులో పాతబస్తీ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నాయి.
మరోసారి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ప్రకటించిన కేంద్రం
ప్రస్తుతం10 రోజులుగా ఒక కేసు నమోదు కానీ ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్ జోన్లుగా తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 65 వరకు శివారు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు నుంచి ఎత్తివేశారు. త్వరలో మరో 25 జోన్లు కూడా ఎత్తివేసేందుకు అధికారులు కసరత్తు చేశారు.
వీటిని తొలగిస్తే పాతబస్తీలోని రెడ్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేబడుతున్నారు. అందుచేత ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపించడం లేదు.
కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ విధించడం ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేసులు నమోదుకానీ జోన్లకు లాక్డౌన్ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.