Homeజాతీయ వార్తలుCAG Report: మోడీ హయాంలో దేశం అప్పుల పాలైందా? కాగ్ నివేదికలో సంచలనాలు

CAG Report: మోడీ హయాంలో దేశం అప్పుల పాలైందా? కాగ్ నివేదికలో సంచలనాలు

CAG Report: గడిచిన పదేళ్లలో దేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే ఐదేళ్లలో మూడోస్థానంలో నిలవడమే తమ లక్ష్యం అని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిని ప్రధానంగా పేర్కొన్నారు. 5 స్థానానికి వచ్చింది నిజమే కానీ, మూడోస్థానం అంత ఈజీ కాదు. ఇక ఆర్థికంగా ఎదిగినా.. అప్పుల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. కాగ్‌ తాజా నివేదిక ప్రకారం, 2013–14 నుంచి 2022–23 వరకు 28 రాష్ట్రాల మొత్తం […]

CAG Report: గడిచిన పదేళ్లలో దేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే ఐదేళ్లలో మూడోస్థానంలో నిలవడమే తమ లక్ష్యం అని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటున్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ దీనిని ప్రధానంగా పేర్కొన్నారు. 5 స్థానానికి వచ్చింది నిజమే కానీ, మూడోస్థానం అంత ఈజీ కాదు. ఇక ఆర్థికంగా ఎదిగినా.. అప్పుల్లో కూడా గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. కాగ్‌ తాజా నివేదిక ప్రకారం, 2013–14 నుంచి 2022–23 వరకు 28 రాష్ట్రాల మొత్తం ప్రభుత్వ రుణం 17.57 లక్షల కోట్ల నుండి 59.60 లక్షల కోట్లకు చేరింది, అంటే 3.3 రెట్లు పెరిగింది. ఈ పరిణామం రాష్ట్రాల ఆర్థిక ఉత్పాదకతను బలహీనపరుస్తూ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో రుణ శాతం 16.66 నుంచి 23 శాతానికి పెరిగింది. ఇది దేశ జీడీపీలో 22.17 శాతానికి సమానమైన 268.9 లక్షల కోట్ల భారాన్ని సృష్టించింది. ఈ ట్రెండ్‌ ఆర్థిక వృద్ధి మూలాలను దెబ్బతీస్తూ, భవిష్యత్‌ పెట్టుబడులకు అడ్డంకిగా మారుతోంది.

రాష్ట్రాల మధ్య వైవిధ్యాలు..
రుణ స్థాయిలు రాష్ట్రాల మధ్య విస్తృతంగా మారుతున్నాయి. 2023 చివరి నాటికి, పంజాబ్‌ 40.35 శాతం జీఎస్‌డీపీతో అత్యధికం, నాగాలాండ్‌ 37.15 శాతం, పశ్చిమ బెంగాల్‌ 33.70 శాతంతో వచ్చాయి. ఇక బీజేపీ పాలిత గుజరాత్‌ 16.37 శాతం, మహారాష్ట్ర 14.64 శాతం రుణాలు నమోదయ్యాయి, అయితే ఒడిశా 8.45 శాతంతో తక్కువ రుణాలు తీసుకుంది. మొత్తంగా, ఎనిమిది రాష్ట్రాలు 30 శాతం మించిన రుణాలతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ వైవిధ్యం పాలనా విధానాలు, ఆదాయ వనరుల పంపిణీలోని అసమానతలను ప్రతిబింబిస్తుంది.

నిబంధనల ఉల్లంఘన..
ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు 2023లో ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించి రోజువారీ ఖర్చులకు కూడా రుణాలు సేకరించాయి. రుణాలు పెట్టుబడులకు మాత్రమే పరిమితం కావాలి, కానీ ఈ రాష్ట్రాలు బాండ్లు, ట్రెజరీ బిల్లులు, బ్యాంకు రుణాలు, ఆర్‌బీఐ వెయ్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ఎల్‌ఐసీ, నాబార్డ్‌ వంటి మార్గాల ద్వారా దీన్ని చేశాయి. ఇది రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరించాయి. దీర్ఘకాలిక స్థిరత్వానికి ముప్పుగా మారింది.

కాగ్‌ నివేదిక మోడీ పాలనా దశలో రాష్ట్రాల రుణాల భారాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఆర్థిక సమతుల్యత లోపాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లోని ఒత్తిడిని, ఆదాయ పంపిణీలోని సమస్యలను గుర్తుచేస్తాయి. రుణ నిర్వహణపై దృష్టి సారించకపోతే, దేశ ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper