Homeజాతీయ వార్తలుHarassment: కోటిన్నర నొక్కి.. భార్య ఏకాంతపు ఫోటోలు బయటపెట్టి..

Harassment: కోటిన్నర నొక్కి.. భార్య ఏకాంతపు ఫోటోలు బయటపెట్టి..

Husband blackmails her over obscene picsHarassment: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. తీరా వివాహం చేసుకున్నాక అతడిలోని సైకో తనం బయటపడింది. మానసికంగా వేధించడం మెదలెట్టాడు. అదనపు కట్నం కావాలని చిత్రహింసలకు (Harassment) గురిచేశాడు. మొదట్లో తీసుకున్నది కూడా చిన్నా చితకా కట్నం కాదు ఏకంగా రూ. కోటిన్నర తీసుకున్నాడు. అయినా అతడిలో ధన దాహం తీరలేదు. మనిషిలో కూడా రాక్షసుడు ఉంటాడని వింటుంటాం. అది ఇతడిలో నిజమే అనిపిస్తోంది. కట్టుకున్న వాడే బ్లాక్ మెయిల్ కు దిగడంతో ఆమె చేసేది లేక పోలీసులను ఆశ్రయించిన ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోంది.

బంజారాహిల్స్ ప్రాంతంలోని రోడ్ నెం. 11లో నివసించే ఓ మహిళ (24) ఎంబీఏ పూర్తిచేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ఆమెకు సికింద్రాబాద్ లోని గన్ రాక్ ఎన్ క్లేవ్ కు చెందిన మహ్మద్ ఫర్హాన్ (26) పరిచయం ఏర్పడి అంది కాస్త ప్రేమగా మారింది. దీంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో మహిళ తండ్రి రూ.కోటిన్నర కట్నంగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అత్తింటివారి అసలు స్వరూపం బయటపడింది. అదనపు కట్నం కావాలని వేధించడం ప్రారంభించారు. మరో పక్క ఇంకా పిల్లలు కలడం లేదని సూటిపోటి మాటలతో నిత్యం బాధ పెట్టేవారు.

దీనికి భర్త కూడా వంత పాడేవాడు. ఈ క్రమంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుకున్నవాడే కాలయముడు కావడంతో ఏడ్వటం తప్ప ఏ మార్గం కనిపించలేదు. కొన్నాళ్లు భరించినా ఇక లాభం లేదని అనుకుంది. పైగా భార్యతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమెను బెదిరింపులకు గురి చేశారు.

తట్టుకోలేని భార్య గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తతోపాటు అత్త మామలు అయేషా ఉస్మాన్, మహ్మద్ ఒస్మాన్ లపై వరకట్నం, వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. మాయమాటలతో నమ్మించి పెళ్లి చేసుకున్నాక ఇలా చేయడంలో ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular