కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారు దింతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫేస్ బుక్ లైవ్ లో డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదని గుర్తు చేశారు. చివరికి కరోనా కట్టడిపై సమీక్ష కోసం గవర్నర్ తమిళిసై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని పిలిస్తే వెళ్లడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ఆయన విమర్శించారు. ప్రజల అవసరాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా విజృంభించి జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయారని మండిపడ్డారు. ‘‘కరోనాతో రోజురోజుకూ భయానక పరిస్థితి ఏర్పడుతోంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని బీజేపీ నాయకులే అంటున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, రోగులకు చికిత్స సరిగ్గా చేయడం లేదు. సీఎం గత పది రోజులుగా కనిపించడం లేదు. కాబట్టి, కేంద్రం కలగజేసుకుని, పెద్దలతో మాట్లాడి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టించండి.’’ అని పొన్నాల విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని పొన్నాల డిమాండ్ చేశారు. పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని.. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యంలా ఉందని పొన్నాల అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ విషయంలో ఆలోచించాలని కోరారు.