Homeఆంధ్రప్రదేశ్‌అమరావతిలో అప్పు పుట్టడం లేదే?

అమరావతిలో అప్పు పుట్టడం లేదే?

Amaravati
 

చంద్రబాబు కలల రాజధాని అమరావతి ఆయన చేసిన నిర్లక్ష్యానికి శాపానికి గురైంది. అధికారం మారింది. అమరావతి కథ అంతరించిపోయే దశకు చేరింది. చంద్రబాబు, ఆయన టీం అమరావతిలో చేసిన భూభాగాలతో విచారణకు ఆదేశించిన జగన్ అమరావతిని పక్కనపెట్టి విశాఖ రాజధాని కోసం పరుగులు పెడుతున్నాడు. 2019 మేలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.

రాష్ట్రానికి మూడు రాజధానులను రూపొందించాలని జగన్ నిర్ణయించి అమరావతి పనులు ఆపుచేయించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం అనేది పెద్ద భారంగా మారింది.సుదీర్ఘ విరామం తర్వాత అమరావతి పెండింగ్‌ పనుల్లో ముఖ్యమైన వాటిని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపిఎంఆర్‌డిఎ) ను జగన్ ఆదేశించారు. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇది పూర్తి చేయడానికి సుమారు 11,000 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు.

కానీ అమరావతిలో పనులు పూర్తి చేయడానికి బ్యాంకులు ఇప్పుడు మరిన్ని రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. మొదట పనులు ప్రారంభించడానికి తీసుకున్న పాత రుణాలను క్లియర్ చేసి, ఆపై తాజా రుణాలు కోరాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

గత రెండేళ్లలో పనులు లేనందున, వడ్డీతో పాటు రుణ భారం కూడా బాగా పెరిగింది. ఇదిప్పుడు ప్రభుత్వానికి భారంగా మారింది. ఆ డబ్బులు చెల్లించకపోవడం.. ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో కొత్త రుణాలను బ్యాంకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.

కాబట్టి  నెలకు రూ.11 కోట్ల వడ్డీతో పాటు, 2,060 కోట్ల రూపాయల పాత రుణాలలో కొంత భాగాన్ని ప్రభుత్వం క్లియర్ చేయకపోతే అమరావతికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించాయి.

పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత, అమరావతి ప్రాజెక్టులపై బ్యాంకులు కూడా ఆసక్తిని కోల్పోయాయి.  “పాత రుణాలు అసలు మరియు వడ్డీతో పాటు క్లియర్ చేయాలి. అప్పటిదాకా తాజా రుణాలకు అవకాశం లేదు” అని బ్యాంకుల కన్సార్టియం ప్రభుత్వానికి స్పష్టం చేసింది.ఇప్పుడు బ్యాంకుల ట్విస్ట్ తో అమరావతికి కొత్త రుణాలు తీసుకునే ప్రణాళికను ప్రభుత్వం విరమించుకుంది, కానీ అది వదలిపెట్టిన ప్రాజెక్టులకు అసలు మరియు వడ్డీని చెల్లించకుండా ప్రభుత్వం తప్పించుకోలేదు. మరీ వీటిపై ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular