జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ ల బదిలీలు చోటు చేసుకున్నాయి. ప్రతి జిల్లాలో ముగ్గురు జాయింట్ కలెక్టర్లలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, మరోకరు రాష్ట్ర సర్వీసులకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పై మరింత పట్టు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణ మూడో జాయింట్ కలెక్టర్ పోస్ట్ ఒకటి. ముగ్గురు జాయింట్ కలెక్టర్ల కు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ గతంలో నే ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
శ్రీకాకుళం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా సుమిత్ కుమార్, జేసీ(అభివృద్ధి)గా కె. శ్రీనివాసులు, విజయనగరం జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా కిషోర్ కుమార్, జేసీ(అభివృద్ధి)గా మహేశ్ కుమార్ విశాఖ జేసీ( రైతు భరోసా, రెవెన్యూ)గా వేణుగోపాల్రెడ్డి, జేసీ (అభివృద్ధి)గా పి. అరుణ్బాబు, తూర్పు గోదావరి జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా లక్ష్మీషా, జేసీ (అభివృద్ధి)గా కీర్తి, పశ్చిమ గోదావరి జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట రామిరెడ్డి, జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా, కృష్ణా జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా మాదవి లతా, జేసీ(అభివృద్ధి)గా శంకర్ లతోటి, గుంటూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా దినేశ్ కుమార్, జేసీ (అభివృద్ధి)గా ప్రశాంతి, ప్రకాశం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా వెంకట మురళి, జేసీ (అభివృద్ధి)గా చేతన్, నెల్లూరు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా వి.వినోద్ కుమార్, జేసీ (అభివృద్ధి)గా ఎన్ ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా మార్కండేయులు, చిత్తూరు జేసీ (అభివృద్ధి)గా వి.వీరబ్రహ్మయ్య కడప జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా ఎం.గౌతమి, జేసీ (అభివృద్ధి)గా సాయి కాంత్ వర్మ, అనంతపురం జేసీ ( రైతు భరోసా, రెవెన్యూ)గా నిశాంత్కుమార్, జేసీ (అభివృద్ధి)గా లావణ్యవేణి, కర్నూలు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ)గా రవిసుభాష్, జేసీ (అభివృద్ధి) ఎస్.రామసుందర్రెడ్డి, 13 జిల్లాల్లో నాన్క్యాడర్ జేసీలందరూ జేసీ సంక్షేమం బాధ్యతలు నిర్వహిస్తారు. దిల్లీ రావును సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది.