అమరావతి భూముల కోసం చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఫూలింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. అంతకు ముందు అందరికి తెలిసింది భూసేకరణ మాత్రమే. భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ల్యాండ్ ఫూలింగ్ కొత్త విధానం. దీంతో ప్రజాప్రయోజనాల కోసం అంటూ భూముల్ని స్వాధీనం చేసుకుంటారు. రాజధాని కోసం పెద్ద ఎత్తున భూములు అవసరం కాబట్టి రాజధానితోపాటు భూములు ఇచ్చిన వారు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ల్యాండ్ ఫూలింగ్ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు.
అంతర్జాతీయ నిపుణుల్ని ఆశ్చర్యపరచిన ఇప్పుడు తెలుగు ప్రభుత్వాల్లో ల్యాండ్ ఫూలింగ్ విధానం అద్భుతమని చెబుతున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీలో ల్యాండ్ ఫూలింగ్ విధానంపై చర్చించారు. తెలంగాణలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ప్రత్యేక లే అవుట్లు అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందుకు విధి విధానాలను రూపకల్పన చేశారు.
కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా దాదాపుగా ఇదే నిర్ణయం తీసుకుంది. శివారు ప్రాంతాల్లో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూమి సేకరించి లే అవుట్లు వేసి మధ్య తరగతిప్రజలకు తక్కువకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రెండు ప్రభుత్వాలు ఫూలింగ్ కోసం ఉత్సాహ పడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో పేద ప్రజలకు భూములు అప్పగించాలని చూస్తున్నారు.
ల్యాండ్ ఫూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం చేతిలో తంటాలు పడుతున్నారు. ఏ ప్రాజెక్టు కోసం అయితే భూమి ఇచ్చారో ఇప్పుడా ప్రాజెక్టు ను ప్రస్తుత ప్రభుత్వం తరలించేస్తోంది. గత ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ చేసింది కాబట్టి తాము పట్టించుకోబోమని చెబుతున్నారు. తరువాత వచ్చే ప్రభుత్వాలు అనుకుంటే రైతులే మునిగిపోతారు. దేనికైనా ప్రభుత్వాలపై విశ్వాసమే మొదటి పెట్టుబడి.