జాతీయ వార్తలుSuryapet Khammam Highway: అదాని అయితే చాలు.. మిగతావేవీ అవసరం లేదు

Suryapet Khammam Highway: అదాని అయితే చాలు.. మిగతావేవీ అవసరం లేదు

Suryapet Khammam Highway: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నప్పటికీ సింహభాగం దక్కుతుంది. ఇప్పుడు మోడీ జమానాలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ అదాని గ్రూప్ కు అలాంటి ప్రయోజనమే లభిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రయోజనాలు కల్పిస్తుందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. తాజాగా కాగ్ నివేదిక వెలువరించిన మరొక విషయం సంచలనంగా మారింది.

సూర్యాపేట ఖమ్మం మధ్య నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి కాంట్రాక్టును.. నిర్మాణంలో ఎటువంటి అనుభవం లేని అదాని కంపెనీకి కట్టబెట్టారని కాగ్ తాజా నివేదిక వెల్లడించింది. అదాని ట్రాన్స్ పోర్ట్ అనే కంపెనీ సారధ్యంలోని “సూర్యాపేట ఖమ్మం రోడ్డు ప్రైవేట్ లిమిటెడ్” కన్సార్టియానికి ఈ కాంట్రాక్ట్ ను 2019లో మంజూరు చేశారు. కన్సార్టియంలో 74 శాతం వాటా ఉన్న అదానీ ట్రాన్స్ పోర్ట్ జాతీయ రహదారుల నిర్మాణంలో ఐదేళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను పూర్తి చేయలేదు. ఆ కంపెనీ సమర్పించిన పనుల జాబితా ప్రకారం.. గతంలో ఎన్నడూ ప్రత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొన్న అనుభవం లేదు. అయినప్పటికీ, జాతీయ రహదారుల అథారిటీ సంస్థ ఎటువంటి కారణాలు చూపుకుండానే , కంపెనీని సాంకేతికపరంగా అర్హత కలిగి ఉన్నట్టు ప్రకటించింది.

1566.30 కోట్ల విలువైన ప్రాజెక్టును 2019 మార్చిలో మంజూరు చేసింది. కాంట్రాక్టు ప్రక్రియ సందర్భంగా కన్సార్టీయంలోని ప్రధాన భాగస్వామి అదాని ట్రాన్స్ పోర్ట్ మరో కంపెనీ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గా ప్రభుత్వానికి సమర్పించింది. ఆ “మరో కంపెనీ” కి అసలు రహదారుల నిర్మాణంలో పనిచేసిన అనుభవం లేదు. అది విద్యుత్ రంగంలో పనిచేసే కంపెనీ మాత్రమే. దీంతోపాటు ప్రధాన భాగస్వామి 304.33 కోట్ల కనీస నికర ఆస్తులను కలిగి ఉన్నట్టు ధ్రువీకరించే చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ థర్డ్ పార్టీ పేరు మీద ఉందని పరిశీలనలో వెళ్ళడైంది. అయితే దీనికి సంబంధించిన వివరణ న్యూస్ లాటరీ వెబ్సైట్ తెలియజేసింది. కాగ్ వెల్లడించిన అంశాలపై అదాని గ్రూప్ సంస్థల అధికార ప్రతినిధిని న్యూస్ లాండ్రీ సంప్రదిస్తే.. అదాని గ్రూపు సంస్థలు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఎటువంటివైనా తాము వాటిని ఖండిస్తామని చెప్పారు. రహదారుల నిర్మాణ రంగంలో అనుభవం విషయంలో కన్సార్టీయంలోని మరొక కంపెనీ అర్హత సరిపోయిందని, నికర ఆస్తులు విషయంలో అదాని ఎంటర్ప్రైజెస్ ఆస్తులను పరిగణనలోకి తీసుకున్నారని వివరించారు. సూర్యాపేట ఖమ్మం నాలుగు వరసల జాతీయ రహదారిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించారు. ఇందులో జాతీయ రహదారుల సంస్థకు 40 శాతం వాటా ఉంది. అయితే మిగతా 60 శాతాన్ని అదాని గ్రూప్ 25 శాతం మాత్రాన్నే కన్సార్టియం చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయిపోయి ప్రస్తుతం వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే దీనిపై కాగ్ నివేదిక వెలువడటం సంచలనం కలిగిస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...
Oktelugu Epaper