బాలయ్యతో సినిమా అంటేనే పెద్ద రిస్క్. అన్ని ఉన్నా మార్కెట్ ఉండదు. మార్కెట్ ఉన్నా గొప్ప కలెక్షన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా భారీ కలెక్షన్స్ రావు, వచ్చినా లాభాలు అయితే రావు, ఈ లోపు మార్కెట్ పరంగా టార్గెట్ ను సాధించలేక సినిమా చేతులు ఎత్తేస్తోంది. ఇది ఇప్పుడు బోయపాటికి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టేలా ఉంది. ఈ సినిమాకి హై బడ్జెట్ అవుతుందని నిర్మాత లెక్కలు ఆరా తీస్తున్నాడట.
Also Read: ప్రపంచ సినీ వేదిక మీద భారతీయ సినిమాకు నిరాశ !
నిజానికి 70 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 50 కోట్లకు కుదించాడు. ఇంకా తగ్గించమంటున్నారు నిర్మాత. దాంతో బోయపాటి స్క్రిప్ట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను తగ్గించడటంతో పాటు రెండు సాంగ్స్ ను కూడా తీసేయబోతున్నాడు. కేవలం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి.. పైగా రెమ్యునరేషన్ ని తగ్గించుకునే విధంగా బాలయ్యను బోయపాటి ఒప్పించాడు. బాలయ్య కూడా ఈ సినిమాకు తక్కువే పుచ్చుకుంటున్నాడు.
అయినా అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో.. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బోయపాటిని కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవల్సిందిగా కోరాడట. అసలుకే ఇచ్చేది తక్కువ, మళ్ళీ ఇప్పుడు ఉన్నదానిలో కూడా తగ్గించుకోమంటే ఎలా అనేది బోయపాటి ఆవేదన. నిజానికి ఒక మాస్ డైరెక్టర్ గా వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గా రికార్డ్స్ ఉన్న తనకు.. పదికోట్లు వరకూ ఇవ్వాలని, అలాంటిది కేవలం ఐదు కోట్లు ఇస్తూ.. ఇప్పుడు దానిలో కూడా తగ్గించుకో అంటే.. కుదరదు అని నిర్మాతకి బోయపాటి క్లారిటీ ఇచ్చాడట.
Also Read: మహేష్ లవ్ ట్రాక్ అదుర్స్ అట !
అయినా సినిమా పూర్తి అయ్యే సమయంలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇంకా రెమ్యునరేషన్ ను తగ్గించుకోమని అడుగుతూ కూర్చోవడం ఏమిటో. మొత్తానికి రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత, బోయపాటి క్రేజ్ బాగా తగ్గింది. ఎలాగూ బాలయ్య బాబుకు అసలు క్రేజే లేదు అనుకోండి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్